Saffron Cultivation: కాశ్మీర్ లోయల్లో పండే కుంకుమ పువ్వు ఇప్పుడు జగ్గయ్యపేటలోనూ కనిపిస్తోంది. తన పొలంలోని నేచురల్ ఫార్మింగ్ భూమిలో రిటైర్డ్ శాస్త్రవేత్త నిమ్మగడ్డ రవీంద్రబాబు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జగ్గయ్యపేటలోని వాతావరణం కుంకుమ పువ్వు సాగుకు అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యేకంగా ఏసీ రూమ్ ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ సాయంతో గదిలోని ఉష్ణోగ్రత, తేమ, కాంతిని నియంత్రిస్తూ… కుంకుమ పువ్వు మొక్కలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
సాధారణంగా చల్లని ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యే పంటను ఇలా కంట్రోల్డ్ టెంపరేచర్లో పెంచడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలి పంటలో వచ్చిన ఫలితాలతో రెండో పంటపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు రవీంద్రబాబు. అయితే ఈ సాగులో ఖర్చు కూడా కీలకమే. ఏసీ రూమ్ ఏర్పాటు ఖర్చు ఎంత? సోలార్ విద్యుత్ వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది? దిగుబడి, మార్కెట్ ధరలు ఎలా ఉంటాయి? అనేది తేలాల్సి ఉంది.
Also read: కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!
కాశ్మీర్ లోయల్లో మాత్రమే సాధ్యమని భావించే కుంకుమ పువ్వును జగ్గయ్యపేటలో సాంకేతికత సాయంతో పండిస్తున్నారు. తొలి ప్రయత్నం ఆశాజనకంగా ఉండటంతో ఈ ప్రయోగం భవిష్యత్తులో రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే కుంకుమపువ్వు సాగు వెదర్ అనుకూలంగా లేని ప్రాంతాల్లోనూ చేపట్టేందుకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.
Also read: ఆపద వస్తే ప్రాణాలు పోవాల్సిందేనా.. 28 ఏళ్లుగా నరకం చూస్తున్న మన్యం గిరిజనులు..!