E-Paper
Advertisement

Google map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సముద్రంలోకి వెళ్లారు.. కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు

Google map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సముద్రంలోకి వెళ్లారు.. కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు
Advertisement

Google map: మనం తెలియని రూట్ కు వెళ్లాలంటే టక్కున గుర్తుకు వచ్చేది గూగుల్ మ్యాప్. ఇది 90 శాతం వరకు కరెక్ట్ మార్గాన్నే చూపిస్తది.. కానీ కొన్ని కొన్ని సార్లు గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ప్రమాదం అంచున పడే ఆస్కారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో గూగుల్ ను నమ్ముకుని తప్పు దారికి వెళ్లిన వార్తలు మనం చాలానే చూసే ఉంటాం. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని ప్రయాణికులు తప్పు మార్గాల్లోకి వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. 2024 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వద్ద గూగుల్ ను నమ్ముకుని కన్ స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జి నుంచి కారు కింద పడి ముగ్గురు యువకులు మృతిచెందారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం, కడలూరు జిల్లాలోని సోతికుప్పం సమీపంలో మద్యం మత్తులో ఉన్న యువత గూగుల్ మ్యాప్ పై ఆధారపడి సముద్రంలోకి కారు వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

చెన్నైకి చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు మద్యం సేవించారు. మద్యం సేవించిన మత్తులో కారును నడిపారు. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కడలూరులోని సోతికుప్పం సమీపంలో తీరం వెంబడి ప్రయాణించుకుంటూ ముందుకెళ్లారు. మ్యాప్ నేరుగా వారిని గమ్య స్థలం పేరుతో సముద్రానికి తీసుకెళ్ళింది. అదృష్టావశాత్తూ… అక్కడున్న జాలర్లు, స్థానికులు పసిగట్టి వెంటనే సముద్రంలోకి వెళ్ళిన కారును అందులో ఉన్న వారిని బయటికి తీసుకువచ్చారు. మొత్తం మీద గూగుల్ మ్యాప్ నమ్ముకుని మరోసారి అపసవ్య మార్గంలో ప్రయాణం చేసి ప్రమాదం పాలయ్యారు. గమనించిన మత్స్యకారులు వారిని సురక్షితంగా వారిని  రక్షించారు. కారును కూడా ట్రాక్టర్ తో పైకి లాగి మత్స్యకారుల సహాయంతో సముద్రం నుండి వెలికితీశారు. వీరు కడలూరు పోర్టు నుంచి పరంగిపేట్టై వైపు సముద్రతీర మార్గంలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఫ్రెండ్ బెట్టింగ్ పెట్టుకుని కారును సముద్రంలోకి నడిపారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ALSO READ: Water Found in Petrol: బురద నీళ్లు పోసి పెట్రోల్ అన్నారు.. ఆ బంకులో ఘరానా మోసం!

Advertisement

సముద్రతీర మార్గాల్లో ప్రయాణించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మద్యపానం చేసి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. గూగుల్ మ్యాప్స్ వంటి టెక్నాలజీలు కొంత హెల్ప్  అయినప్పటికీ, వాటిని గుడ్డిగా నమ్మకుండా స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, తీరప్రాంతాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత అవసరమని హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన నుండి యువత ఎంతో నేర్చుకోవాలని చెబుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం సరి కాదని సూచించారు.

ALSO READ: Jupally Krishna Rao: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో.. లేదో.. నేను కూడా కష్టమే, జూపల్లి సంచలన వ్యాఖ్యలు

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×