E-Paper
Advertisement

Viral Video: ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టి, కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టి, కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్!

ఆవేశంలో తప్పు చేయడం, ఆ తర్వాత బాధ పడటం కామన్ అయ్యింది. తాజాగా ఓ మహిళ బెంగళూరులో ఆటో డ్రైవర్ ను చెప్పుతో కొట్టడం సంచలనం గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. చివరకు సదరు మహిళ స్టేషన్ కు వచ్చి ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పడంతో కథ సుఖాంతం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

బీహార్ నుంచి వలస వచ్చిన పంఖూరి మిశ్రా (28) అనే మహిళ, తాజాగా ఆటో డ్రైవర్ లోకేష్(33)ను చెప్పుతో డ్రైవర్‌ ను పదే పదే కొడుతుంది. రెండు రోజుల క్రితం మిశ్రా, మె భర్త ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లోకేష్ ఆటోను ఢీకొట్టారు. వాళ్లే వేగంగా వచ్చి తన ఆటోను ఢీకొట్టడంతో పాటు తన మీద దాడి చేశారని లోకేష్ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన బెల్లందూర్‌ లోని సెంట్రో మాల్ కెమెరాలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఘటనపై ఆటో డ్రైవర్లు ఆందోళనలు నిర్వహించారు. సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులను ఆశ్రయించిన ఆటో డ్రైవర్

అటు ఎలాంటి కారణం లేకుండా తనపై దాడి చేశారని లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిశ్రాతో పాటు ఆమె భర్తపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. లోకేష్ ఫిర్యాదును తీసుకున్నన బెల్లందూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం మిశ్రా దంపతులను పోలీసులు స్టేషన్ కు పిలిచారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరై, డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడని చెప్పింది. కానీ, ఆ తర్వాత సీసీ టీవీ విజువల్స్ బటపెట్టడం అవాక్కైంది.

ఆటో డ్రైవర్ కు క్షమాపణలు చెప్పిన మిశ్రా దంపతులు 

ఏం చేయాలో అర్థం కాని మిశ్రా దంపతులు.. కాంప్రమైజ్ కావడం బెస్ట్ అనుకున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే బహిరంగ క్షమాపణలు చెప్పారు. మిశ్రా దంపతులు ఇద్దరూ ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు వేడుకున్నారు.  కావాలని, తాను అలా చేయలేదని చెప్పింది. తాను ప్రెగ్నెంట్ కావడంతో బైక్ మీద వెళ్తుండగా ఆటో దగ్గరగా రావడంతో భయపడ అతడిని కొట్టానని చెప్పింది. తనకు బెంగళూరు అన్ని, కర్నాటక ప్రజలు అన్నా ఎంతో గౌరవం అని చెప్పింది. బీహార్ నుంచి వస్తున్న తనకు ఉపాధి కల్పిస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తంగా పోలీస్ స్టేషన్ వేదికగా మిశ్రా దంపతులు ఆటో డ్రైవర్ కు క్షమాపణలు చెప్పడంతో లోకేష్ కేసు విత్ డ్రా చేసుకున్నట్లు వెల్లడించారు. మిశ్రా దంపతులు చేసిన తప్పును తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Read Also:  రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×