E-Paper

చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన అంబటి.. ఆ ఆస్తి లోకేష్ పేరిట ఎలా రాశారు?

చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన అంబటి.. ఆ ఆస్తి లోకేష్ పేరిట ఎలా రాశారు?
Advertisement

Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనను గాలికొట్టేసి, కేవలం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన కుటుంబమే లక్ష్యంగా చౌకబారు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని, ఆయన జీవితమంతా నీచ రాజకీయాలేనని ధ్వజమెత్తారు.

జగన్ పేరు చెప్తేనే ప్రస్టేషన్

Advertisement

చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని అంబటి విమర్శించారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులను, ‘మావిగన్’ అనే పేరును తలుచుకుంటేనే చంద్రబాబుకు తీవ్రమైన ప్రస్టేషన్ వచ్చేస్తోందని అన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని, అదే పులివెందుల వెళ్తే వైఎస్సార్, జగన్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో కళ్లారా చూడవచ్చని సవాల్ విరాశారు. ఎన్నికలకు వెళ్లేటప్పుడు కూడా తాము చేసిన అభివృద్ధిని చూపే వెళ్తామని చెప్పడంతో చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.

కుటుంబ విలువలు లేని వ్యక్తి

Advertisement

చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ.. తడి గుడ్డలతో గొంతులు కోసే రకం చంద్రబాబు అని అంబటి వ్యాఖ్యానించారు. సొంత తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండలు కూడా సరిగ్గా చేయని వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలకు సూక్తులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని లోకేష్ పేరు మీద రాయించుకున్నారని, కన్న చెల్లెళ్లను కనీసం ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టని చరిత్ర ఆయనదని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబంలోని వారందరినీ బయటకు నెట్టేసిన వ్యక్తి చంద్రబాబని, ఆయన రాజకీయ ప్రస్థానంపై తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా పుస్తకం రాశారని గుర్తుచేశారు. ఆఖరికి సొంత తమ్ముడికి సంకెళ్లు వేసి ఇంట్లో దాచిపెట్టిన చంద్రబాబుకు, తమ పార్టీని ‘గొడ్డలి పార్టీ’ అని విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.

Also Read:  ఉప్పల్‌లో దారుణం.. భార్యను చంపి.. బావమరదలికి ఫోన్ చేసిన భర్త!

రాష్ట్రంలో అరాచక పాలన, సాయికృష్ణ కేసు

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసులపై దాడులు చేస్తున్నది కూటమి వారేనని అంబటి ఆరోపించారు. సాయికృష్ణ అనే యువకుడిని చంపేసి, కనీసం బూడిద కూడా ఇవ్వలేదని ఆ తల్లి రోదిస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడం లేదన్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఆ యువకుడిని క్రిమినల్ అనడం దుర్మార్గమన్నారు. ఇన్నాళ్లూ దొరకని బూడిద, ఎముకలు అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్‌కు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ, ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఐ నాగరాజు లాంటి అధికారులే తమ ప్రాణాలకు రక్షణ లేదని భయపడుతున్నారంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని అంబటి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సొల్లు కబుర్లు ఆపి, ఇచ్చిన హామీల అమలుపై, పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Related News

వైసీపీకి మళ్లీ 11 సీట్లు కూడా రావు.. ఓపెన్ ఛాలెంజ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే!

‘నా కొడుకు నీ ఫ్యాన్.. వాడ్ని క్రిమినల్ అంటావా?’ పవన్‌పై సాయికృష్ణ తల్లి ఫైర్!

పవన్ కల్యాణ్ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారు: పేర్నినాని

“మాకు రోడ్డు కావాలి సార్..!” బురద బాటలో బాల్యం.. జంగారెడ్డి గూడెం హాస్టల్ పిల్లల కన్నీటి ఆవేదన

ఉక్కు పరిశ్రమ జగన్ పుణ్యమే.. చంద్రబాబుది ‘క్రెడిట్ డ్రామా’.. ఎంపీ అవినాష్ ఫైర్

ఏపీ, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. నేటి నుంచి దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్.. బడ్జెట్, ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×