E-Paper
Advertisement

AP Cabinet: రూ. 85 వేల కోట్ల పెట్టుబడుల రాక.. ఆ పని చేస్తే ఇక చుక్కలే.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం

AP Cabinet: రూ. 85 వేల కోట్ల పెట్టుబడుల రాక.. ఆ పని చేస్తే ఇక చుక్కలే.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం

AP Cabinet Meeting: ఏపీకి పెట్టుబడుల జాతర మొదలైంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాల జాతర మొదలైందని చెప్పవచ్చు. పెట్టుబడుల రాకతో యువతకు ఉపాధి కల్పన చేరువచేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.

ఏపీ కేబినెట్ సమావేశం ఈనెల 18వ తేదీన నిర్వహించాలని ముందుగా నిర్ణయించగా, సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో 20వ తేదీకు వాయిదా వేశారు. తినే పద్యంలో బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరయ్యారు.

రాష్ట్రానికి పెట్టుబడుల సాధన పై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏకంగా రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాల రవాణాను అరికట్టే చర్యలలో భాగంగా ప్రయోగించే పీడీ యాక్ట్ చట్టాన్ని సైతం మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు సైతం కేబినెట్ పచ్చి జెండా ఊపింది. దీనితో రాష్ట్రంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

అంతేకాకుండా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం, లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి, మత్తు పదార్థాలను వినియోగించే వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్ర రాజధానిగా గుర్తించబడ్డ అమరావతిలో సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్, స్పోర్ట్స్ పర్యాటక పాలసీలపై సైతం నిర్ణయం తీసుకుంది.

Also Read: YS Jagan – RGV: దర్శకుడు ఆర్జీవీకి జగన్ సపోర్ట్.. షాకిచ్చిన ప్రకాశం పోలీస్.. 25న విచారణకు రాకుంటే?

ఏపీ టవర్ కార్పొరేషన్ ను ఫైబర్ గ్రిడ్ లో విలీనం చేయడంతో పాటు, దేవాలయ కమిటీలలో ఇద్దరు సభ్యులకు తప్పనిసరిగా చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలుపగా, ఇప్పటినుండి ఆలయాల కమిటీ సభ్యులలో అధికారులతో పాటు స్థానిక భక్తులకు సైతం కమిటీలో చోటు దక్కనుంది. ఇలా ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కీలక అంశాలను ప్రస్తావించి ఆమోదించారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×