E-Paper
Advertisement

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు ఢీకొని దంపతులు మృతి!

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు ఢీకొని దంపతులు మృతి!
Advertisement

Palnadu Road Accident: అమరావతి ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

వెల్లటూరు రోడ్డులోని హనుమాన్‌నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దంపతులిద్దరూ బైక్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక జీపు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బైక్ పైనున్న దంపతులు రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను వల్లూరి రవి (58), ఆయన భార్య సావిత్రి (55)గా గుర్తించారు. కాగా, సావిత్రి స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. రోజువారీ పనుల్లో భాగంగా బయటకు వెళ్లిన దంపతులు ఇలా అనంత లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన జీపు డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement

Also Read: ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

Tags

Related News

9 ఏళ్లుగా ఆగని కన్నీటి పోరాటం.. కర్నూలు టూ అమరావతి వీల్ చైర్ యాత్ర ఉద్రిక్తం!

‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!

అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ ఇచ్చిన సీఎం!

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు

దేవుడా.. వీళ్లా మాకు నాయకులు? కూటమి వైఖరిపై సభలోనే బొత్స ఆవేదన!

గుడి లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా.. వైసీపీపై చంద్రబాబు ఫైర్!

Big Stories

Advertisement
×