BigTV English
Advertisement

Weather Update: వింత వాతావరణం.. రోహిణి కార్తెలో పగలని రోళ్లు, భారీ వర్షాలు

Weather Update: వింత వాతావరణం.. రోహిణి కార్తెలో పగలని రోళ్లు, భారీ వర్షాలు

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో అకాల వర్షాలు పడుతున్నాయి. నేటి నుంచే రోహిణి కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడుతాయని అనే నానుడి ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు దంచికొట్టే రోహిణి కార్తెలో వర్షాలు పడుతున్నాయి.


రోహిణి కార్తె సమయంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఈ సమయంలో వేడి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎండలు బీభత్సంగా కొడుతాయి. ఈ ఏడాది అకాల వర్షాలు, అల్పపీడనం కారణంగా వేసవి కాలం కాస్త వర్షాకాలంగా మారింది. ఈ సారి కొంచెం ముందగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముందస్తుగానే అకాల వర్షాలు పడుతుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ తర్వాత వర్షాలు పడతాయో అనే సందిగ్దంలో రైతులు పడిపోయారు.  అయితే ఈ సారి వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని ముందుస్తుగానే వాతావరణ శాఖ పేర్కొంది.

అయితే, ఇటీవల కాలంలో వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వేసవి కాలంలో వర్షాలు, వర్షా కాలంలో ఎండలు దంచికొడుతున్నాయని.. వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఇందుకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం కారణమని వాతావరణ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఎల్లుండి పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ALSO READ: Rain Alert: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్టర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.

ALSO READ: ARMY PUBLIC SCHOOL: డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.52,500 జీతం.. ఇంకెందుకు ఆలస్యం

భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మూడు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.

Related News

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Big Stories

×