E-Paper
Advertisement

Weather Update: వింత వాతావరణం.. రోహిణి కార్తెలో పగలని రోళ్లు, భారీ వర్షాలు

Weather Update: వింత వాతావరణం.. రోహిణి కార్తెలో పగలని రోళ్లు, భారీ వర్షాలు

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో అకాల వర్షాలు పడుతున్నాయి. నేటి నుంచే రోహిణి కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడుతాయని అనే నానుడి ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు దంచికొట్టే రోహిణి కార్తెలో వర్షాలు పడుతున్నాయి.

రోహిణి కార్తె సమయంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఈ సమయంలో వేడి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎండలు బీభత్సంగా కొడుతాయి. ఈ ఏడాది అకాల వర్షాలు, అల్పపీడనం కారణంగా వేసవి కాలం కాస్త వర్షాకాలంగా మారింది. ఈ సారి కొంచెం ముందగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముందస్తుగానే అకాల వర్షాలు పడుతుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ తర్వాత వర్షాలు పడతాయో అనే సందిగ్దంలో రైతులు పడిపోయారు.  అయితే ఈ సారి వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని ముందుస్తుగానే వాతావరణ శాఖ పేర్కొంది.

అయితే, ఇటీవల కాలంలో వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వేసవి కాలంలో వర్షాలు, వర్షా కాలంలో ఎండలు దంచికొడుతున్నాయని.. వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఇందుకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం కారణమని వాతావరణ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఎల్లుండి పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ALSO READ: Rain Alert: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్టర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.

ALSO READ: ARMY PUBLIC SCHOOL: డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.52,500 జీతం.. ఇంకెందుకు ఆలస్యం

భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మూడు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×