Sugali Preethi: జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి..! ఈ డిమాండ్కు 9 ఏళ్లు నిండాయి. నిరీక్షణే తప్ప న్యాయం జరగడం లేదని వాపోతున్నారు పేరెంట్స్. ప్రీతి సంస్మరణ రోజు సందర్భంగా కర్నూలు నుంచి అమరావతికి వీల్ చైర్ యాత్ర తలపెట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
సుగాలి ప్రీతిది హత్యనేన..
కర్నూలు శివారులోని రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2017 ఆగస్టు 19న ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందన్నారు మేనేజ్మెంట్ .కానీ ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. లైంగిక దాడి జరిగిందన్న పోస్ట్మార్టమ్ రిపోర్ట్ను కూడా మార్చేశారని న్యాయపోరాటానికి దిగారు.
ప్రీతి పేరెంట్స్ ఫిర్యాదుతో హత్య..
ప్రీతి పేరెంట్స్ ఫిర్యాదుతో హత్య, POCSO, SC/ST అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదయింది. స్కూల్ యాజమాన్యానికి చెందిన వ్యక్తులతో పాటు వారి కుమారులను నిందితులుగా చేర్చారు. దర్యాప్తులో భాగంగా అరెస్టులు జరిగాయి. అయితే కొంతకాలానికే నిందితులు బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పటికైనా నిందితులెవరో తేల్చి చట్టప్రకారం వాళ్లను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రీతి పేరెంట్స్.
ప్రత్యేక ప్రభుత్వ కమిటీలు..
ప్రీతి కేసులో నిజానిజాల నిర్ధారణ కోసం ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేశారు. నివేదికలు వచ్చాయి. కానీ ఇప్పటికీ న్యాయం మాత్రం ఎండమావిగానే మారిందంటున్నారు పేరెంట్స్.
Also Read: సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలోని నలుగురి మృతి!