E-Paper
Advertisement

సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలోని నలుగురి మృతి!

సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలోని నలుగురి మృతి!
Advertisement

Siddipet: సిద్దిపేట జిల్లాలో బుధవారం అర్థరాత్రి అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన చావు.. ఒకే ఇంట్లోని నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. చీకట్లో కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పసిపాపలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ప్రమాదం జరిగిందిలా..

Advertisement

దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), తన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)తో కలిసి పనిమీద సిద్ధిపేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం అర్థరాత్రి కారులో స్వగ్రామానికి వస్తుండగా.. అప్పనపల్లి శివారులోకి రాగానే కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన రక్షణ లేక తెరిచి ఉన్న బావిలోకి నేరుగా దూసుకెళ్లింది. నీటిలో మునిగిపోవడంతో కారులోనే శ్వాస ఆడక కుటుంబం మొత్తం మృతి చెందింది.

వెలికితీసిన సహాయక సిబ్బంది

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి వేళ కావడం, బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. చివరికి జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. వాహనంలోంచి నాలుగు మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: కేసీఆర్ బాటలోనే కవిత.. తమిళనాడు విజయ్ సీక్రెట్ జ్యోతిష్యుడితో సంచలన భేటీ!

Tags

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

Big Stories

Advertisement
×