BigTV English
Advertisement

TDP Cadre Angry: మంత్రి రామ్మోహన్ నాయుడిపై కేడర్ ఆగ్రహం.. ఆపై ట్రోలింగ్, ఎందుకు?

TDP Cadre Angry: మంత్రి రామ్మోహన్ నాయుడిపై కేడర్ ఆగ్రహం.. ఆపై ట్రోలింగ్, ఎందుకు?

TDP Cadre Angry: సమయం, సందర్భం వచ్చినప్పుడు కొందరు నేతలు చెప్పేమాట. పార్టీ కార్యకర్తలే తమకు సుప్రీం అప్పుడప్పుడు చెబుతారు. ఇప్పుడు అదే కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఎలాంటి నాయకుడైనా తలవంచాల్సిందే. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విషయంలో ఏం జరగబోతోంది? ఇదే ప్రశ్న టీడీపీ అభిమానులను వెంటాడుతోంది.


కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథ సప్తమి సందర్భంగా శ్రీకాకుళం పట్టణానికి వచ్చారు సింగర్ మంగ్లీ. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీ తరహాలో మంత్రి రామ్‌మోహన్‌ నాయుడు పక్కనే నిలబడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై మండిపడుతోంది టీడీపీ కేడర్.

ప్రొటోకాల్ ప్రకారం ఆమెకు దర్శనం చేసుకున్నారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. వైసీపీ సింగర్‌ మంగ్లీని దగ్గరుండి దర్శనం చేయించడంపై రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసిన మంగ్లీని దర్శనానికి ఎలా తీసుకెళ్లారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.


ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున పాటలు పాడమంటే పాడలేదని, అలాంటి వ్యక్తికి దగ్గరుండి ఏ విధంగా దర్శనం చేయిస్తారని రుసరుసలాడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు పలకనన్న మంగ్లీ.. వీఐపీ ఏ విధంగా అయ్యిందని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం తాము 40 ఏళ్లు కష్టపడ్డామని గుర్తు చేస్తున్నారు. మరి కార్యకర్తల ట్రోలింగ్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ALSO READ:  ఢిల్లీ టూర్‌లో మంత్రి లోకేష్ బిజీ, మా టార్గెట్ అదే

వైసీపీ హయాంలో టీటీడీ ఛానెల్‌కు మంగ్లీ సలహాదారుగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరపున ఆమె పాడిన పాటలు ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో టీడీపీకి పాటలు పాడాలని రిక్వెస్ట్ చేశారట కొందరు నేతలు. ఎట్టి పరిస్థితుల్లో పాడేది లేదని తెగేసి చెప్పారంట సింగర్.

ఈ వ్యవహారాన్ని నేతలు మరిచిపోయినా, కార్యకర్తలు మరిచిపోలేదు. ఇది ముమ్మాటికీ పార్టీ కార్యకర్తలను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. కార్యకర్తలకు క్షమాపణలు చెప్పి ఈ విషయానికి ఇంతటితో ముగింపు ఇస్తారో లేదో చూడాలి.

 

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×