E-Paper
Advertisement

Piyush Goyal: సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు.. పీయూష్ గోయల్‌కు తప్పిన ప్రమాదం

Piyush Goyal: సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు.. పీయూష్ గోయల్‌కు తప్పిన ప్రమాదం
Advertisement

Piyush Goyal: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వినియోగించే హెలీకాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే ఈ రోజు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర పర్యటనకు అదే హెలీకాప్టర్‌ని అధికారులు కేటాయించారు. ఇదే హెలీకాప్టర్‌లో తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు పీయూష్ గోయల్ వెళ్లేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

అయితే పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం రావడంతో కృష్ణపట్నం పర్యటనను వెంటనే రద్దు చేసుకున్నారు. వీఐపీలు ప్రయాణం చేసే హెలీకాప్టర్ లో సాంకేతిక సమస్యలు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.సీఎం హెలీకాప్టర్ లో టెక్నికల్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పై రిపోర్ట్ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ హెలికాప్టర్‌ను వినియోగించవచ్చా..? లేదా..? అనే దానిపై రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీ అధికారులను కోరారు.

Advertisement

ALSO READ: అంతా కేసీఆరే చేశాడు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలకు వెళ్లేటప్పుడు తరుచూ జీఎంఆర్ సంస్థకు చెందిన హెలికాప్టర్‌ను వాడుతుంటారు. అయితే, ఈ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ఇంటెలిజిన్స్ అధికారులకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ALSO READ: HYDERABAD: ఫుల్‌గా తాగేసి ఒంటెపై.. ఓరి వీడి వేశాలో.. వైరల్ వీడియో

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×