MPs MLAs Cases: దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏకంగా 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక తెలిపింది. ఇందులో 519 కేసులు పదేళ్లకు పైగా పెండింగ్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. మరో 700 కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నాయ్. కొన్ని కేసుల్లో ఛార్జిషీట్ దాఖలుకే ఏళ్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. కొత్త బిజినెస్
28 రాష్ట్రాల్లో 14 మంది ముఖ్యమంత్రులపై కూడా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అయితే కేసు ఉన్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు. కానీ ప్రజాప్రతినిధులపై కేసులు ఏళ్ల తరబడి తేలకపోతే ఎలా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయ్? పోలీసులు కూడా స్పీడ్ గా ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం కూడా ముఖ్యమే. రాజకీయ నేతల కేసులను స్పీడ్ గా విచారణ చేయాలన్న ఇష్యూ చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.
Also Read: తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?