AP DSC Row: ఏపీ అసెంబ్లీ ఆవరణలో డీఎస్సీ అంశం మరోసారి పొలిటికల్ హీట్ పెంచింది. చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత, వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలో చర్చిస్తామంటున్న కూటమి నేతలు.. మండలిలో చర్చకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమంటున్న ప్రభుత్వం.. డేట్, టైమ్ మాత్రం ఖరారు చేయకపోవడం ఏంటన్న ప్రశ్నల్ని వైసీపీ వినిపిస్తోంది. ఎల్నినోపై చర్చ పూర్తయ్యాక డీఎస్సీ అంశాన్ని తీసుకుంటామని కూటమి ప్రభుత్వం అంటోంది.
Also Read: శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!
మరోవైపు, తమ హయాంలోని గ్రూప్-1 నియామకాలపై సీబీఐ విచారణ చేయించుకోవాలని వైసీపీ సవాల్ విసరడం కీలకంగా మారింది. మండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేది వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. 14సార్లు డీఎస్సీ వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. సో డీఎస్సీ ఇష్యూను వైసీపీ వదిలిపెట్టేలా కనిపించట్లేదు. అదే టైంలో కూటమి ప్రభుత్వం కూడా తమ స్ట్రాటజీని కంటిన్యూ చేస్తోంది. ఏం తేలుతుందో చూడాలి.
Also Read: తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?