Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది. లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ వంటి కీలక నేతలకు జాతీయ స్థాయిలో బాధ్యతలు ఇవ్వకపోవడం.. రాష్ట్ర రాజకీయాలపై హైకమాండ్ కొత్త లెక్కలు వేస్తోందన్న సిగ్నల్స్ ఇస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్ పాలిటిక్స్ అధిష్ఠానానికి ఆందోళన కలిగిస్తున్నాయ్. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలను హైకమాండ్ జోక్యం చేసుకుని పరిష్కరించింది. మిగితా నాయకుల మధ్య కూడా గ్యాప్ లు తగ్గించాలని హైకమాండ్ అనుకుంటోంది.
Also Read: శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!
బెంగాల్ లో పగ్గాలు చేపట్టాక తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్న జాతీయ నాయకత్వం, స్థానిక నేతలకు పెద్దపీట వేయకుండా ఏ రకమైన సమీకరణాలు మారుస్తోంది? కేడర్లో జోష్ నింపాల్సిన టైంలో ఈ తరహా పరిణామాలు పార్టీకి మేలు చేస్తాయా? లేక కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా? అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణను టార్గెట్ చేయాలంటే ముందుగా రాష్ట్ర యూనిట్ను ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి నేషనల్ టీమ్లో తెలంగాణకు చోటు లేకపోవడం.. కమలనాథుల వ్యూహంలో కొత్త అధ్యాయానికి సంకేతమా? మరేదైనా ఉందా?
Also Read: ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!