Recharge Plans: టెలికాం కంపెనీలు ఇన్ కం పెంచుకోవడమే టార్గెట్గా అడుగులు వేస్తున్నాయ్. దొరికిన వాళ్లను దొరికినట్లుగా బుక్ చేస్తున్నాయ్. మొబైల్ కామన్ అయింది. ఫోన్ లేకుండా ఎవరూ లేరు. సో ఒక్కో కస్టమర్ నుంచి అందినంత గుంజుదాం అన్నట్లుగా స్ట్రాటజీ నడుస్తోందా అన్న డౌట్లు పెరుగుతున్నాయ్.
ఎయిర్ టెల్, జియోకు దేశంలో చాలా మంది కస్టమర్లు ఉన్నారు. వీళ్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టే వ్యూహంతో వ్యాలిడిటీ ప్లాన్లు మారుస్తున్నారు. పాత వాటితో పోలిస్తే చడీ చప్పుడు లేకుండా 50 రూపాయల దాకా బాదేసే ప్రోగ్రామ్ నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ల దగ్గర్నుంచి కూడా భారీగా డబ్బులు లాగే ప్రయత్నాలపై విమర్శలు పెరుగుతున్నాయ్.
Also Read: దోశను స్పూన్తో తినాలా? పైగా దానికి ట్రైనింగ్ కూడా!
వీటికి తోడు టెలికాం కంపెనీల 28 రోజుల లెక్క మరో గేమ్గా కనిపిస్తోంది. ఈ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ మతలబులపై ఎంపీ రాఘవ్ చద్దా గతంలోనే ఫైర్ అయ్యారు. ఏడాదికి 12 నెలలే అయినప్పటికీ, 28 రోజుల సైకిల్ కారణంగా కస్టమర్లు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని, ఇది వినియోగదారులపై అదనపు ఆర్థిక భారమన్నారు. జీతం, ఇల్లు అద్దె, ఈఎంఐలు అన్నీ క్యాలెండర్ నెల ప్రకారం ఉన్నప్పుడు, రీఛార్జ్లు మాత్రం 28 రోజులకే ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయ్. ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైన మొబైల్ రీచార్జ్పై మోదీ సర్కార్ ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చిందా?
Also Read: మంత్రి పదవి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వడానికి చాన్సు లేదు.. కోమటిరెడ్డి మారేదీ లేదూ!