Council Election: ఏపీ శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సాధారణంగా అధికార, ప్రతిపక్షాల రాజకీయ ప్రక్రియలో భాగంగానే సాగుతుంది. కానీ ఈసారి సీన్ డిఫరెంట్గా కనిపించింది. పోటీ లేకుండానే తూమాటి మాధవరావు ఎన్నిక కావడం.. ఆ తర్వాత ఆయనను చైర్లో కూర్చోబెట్టే కార్యక్రమంలోనూ కూటమి నేతల గైర్హాజరు చర్చకు దారి తీసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు టీడీపీ ఎందుకు దూరంగా ఉంది? కూటమి వ్యూహంలో ఇదొక పొలిటికల్ మెసేజా? లేక సభా వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక నిర్ణయమా? అన్న టాక్ నడుస్తోంది.
Also Read: 22A నిషేధిత భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్.. సచివాలయంలో బిగ్ రివ్యూ!
సాధారణంగా కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్ను చైర్లో కూర్చోబెట్టే సమయంలో మంత్రులు, సభ్యులు పోడియంపైకి వెళ్లడం సంప్రదాయం. కానీ ఈసారి ఆ సీన్ కనిపించలేదు. కూటమి తరఫున సభ్యులు ఎందుకు దూరంగా ఉన్నారు? రాజకీయ విభేదాలా? లేక ఫ్యూచర్ స్ట్రాటజీకి ఇది సంకేతమా అన్న చర్చ జరుగుతోంది.