Congress Internal Crisis: పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? కలిసి కట్టుగా ఎలా ముందుకు వెళ్లాలి? వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించుకోవాలి? ఏదైనా పార్టీకి ఇది ముఖ్యం. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం కథ వేరుగా ఉంటోంది. ఎవరికి వారే నేనే పోటీ చేస్తా.. ఎవరైతే నాకేంటి..? నాదే సీటు.. నాదే సెగ్మెంట్ ఇలాంటి కామెంట్లు పెరుగుతున్నాయ్. ఇది వర్కవుట్ అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది.
రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై TPCC క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు చేసినా.. ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. వనపర్తిలో చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య విభేదాలు కూడా బహిరంగమయ్యాయి. ఇప్పుడు కొండా సుస్మిత వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. పరకాల టికెట్ విషయంలో సీఎం రేవంత్రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి మద్దతు ప్రకటించడంతో.. కొండా క్యాంప్ అసంతృప్తికి గురైంది.
Also Read: విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు
ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేసింది. అయితే సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్న సురేఖ వైఖరి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయ లెక్కలే పైచేయి సాధిస్తున్నాయా? నోటీసులు, షోకాజ్ లతో వీళ్లంతా దారికి వస్తారా?
Also Read: ఆ వ్యూహం ఇక్కడ పనిచేయదు.. స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు