DSC Recruitment: డీఎస్సీ, గ్రూప్ 1 చుట్టూ ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. మండలిలో డీఎస్సీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించడంతో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభ వాయిదా పడింది. మరోవైపు.. అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు.
తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 లాంటి స్కామ్ను చూడలేదని చంద్రబాబు అన్నారు. బుధవారం నాడు అసెంబ్లీలో అన్ని వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అతి తక్కువ రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామన్నారు మంత్రి లోకేశ్. దేశ చరిత్రలోనే తొలిసారిగా వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను పారదర్శకంగా అమలు చేశామని, భిన్నాభిప్రాయాలతో కొందరు కోర్టులను ఆశ్రయించినప్పటికీ నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లామన్నారు.
Also Read: టిమ్స్ క్రెడిట్ కేటీఆర్దా? ఎర్రగడ్డలో షాకిస్తే సెట్ అవుతుంది.. సీఎం రేవంత్ సెటైర్లు
అటు టెట్ మినహాయింపుపై వినతిపత్రం ఇచ్చిన టీచర్లను సస్పెండ్ చేయడంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి టీచర్లను వేధిస్తారా అని జగన్ కార్నర్ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో లోపాలన్నీ బయటకు వస్తున్నాయన్న పాయింట్ ను వైసీపీ గట్టిగా వినిపిస్తోంది. వీటికి కౌంటర్ గా గ్రూప్ 1 ను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. మరి ఎల్లుండి ఏం జరగబోతోంది?
Also Read: మద్యం మత్తులో ఖాకీల కారుకు యాక్సిడెంట్.. పోలీసుల కారులో డ్రగ్స్, మద్యం కలకలం!