Police Car: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవర్పాడు దగ్గర ఆటోను పోలీసుల కారు ఢీకొంది. ఆటో బోల్తాపడి నలుగురికి గాయాలయ్యాయి. ఇక్కడే ట్విస్ట్ ఉంది. పోలీసులు మద్యంమత్తులో కారు నడుపుతున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. కారును అడ్డుకొని నిలదీయగా.. ఆ కారులో బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైలు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. అంతే కాదు కారులో గంజాయి ప్యాకెట్లు, మద్యం బాటిళ్లను గుర్తించారు. స్థానికులు వీడియోలు కూడా తీశారు.
మరి ఈ గంజాయి ప్యాకెట్లు ఎవరివి? యాక్సిడెంట్ జరగకపోతే గంజాయి చేరాల్సిన చోటికి చేరి ఉండేదా అన్న డౌట్లను స్థానికులు వినిపించారు. ఇది కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో పోలీసులే గంజాయి రవాణా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. మద్యంమత్తులో యాక్సిడెంట్ చేయడమే కాకుండా జనాన్ని బెదిరించడమేంటని క్వశ్చన్ చేశారు.
Also Read: తెలంగాణలో డిగ్రీ కాలేజీల సంక్షోభం.. సీటు ఉచితంగా ఇస్తామన్నా చేరని విద్యార్థులు
కారులో పట్టుబడ్డ గంజాయి, మద్యంబాటిళ్లకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని డీఎస్పీ బాలమురళీకృష్ణ క్లారిటీ ఇచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పట్టుకునే క్రమంలో పోలీసుల కారు ఆటోను ఢీకొట్టిందన్నారు. అతడు పోలీసులను చూసి మద్యం బాటిళ్లు, గంజాయి వదిలేసి పరారయ్యాడని, వాటినే పోలీసులు కారులో తీసుకొని ఆ వ్యక్తిని వెంబడిస్తుండగా పోలీసుల కారు ఆటోని ఢీకొట్టిందన్నారు. ఇందులో ఏది నిజం అన్న పాయింట్ చుట్టూ చర్చ నడుస్తోంది.
Also Read: ఉప్పల్ బాలు వివాదంపై స్పందించిన నవదీప్.. వీడియో వైరల్!