Telangana Local Polls: స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదన్న ఫీడ్బ్యాక్ ఇప్పుడు అధిష్టానాన్ని కలవరపెడుతోంది. మొన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. మంత్రుల వర్క్ గ్రాఫ్ను ముందుపెట్టి మరీ క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు అదే అంశంపై సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించడం.. అసలు మంత్రులు జిల్లాల్లో ఏం చేస్తున్నారన్న ప్రశ్న గాంధీభవన్లో బిగ్ సౌండ్ చేస్తుంది.
Also Read: మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?
బీఎల్వో స్థాయి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వరకు.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బాధ్యతలు అప్పగించారు. జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పదేపదే సూచించారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో మంత్రుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికైనా మంత్రులు విధిగా రెండు రోజులు జిల్లాల్లోనే గడపాలని, తొలగించిన ఓట్లను మళ్లీ జాబితాలో చేర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఇప్పుడు మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్తే జరిగిన డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా?
Also Read: వెంకీ మామ చేతికి మళ్లీ గన్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్గా!