E-Paper
Advertisement

New Income Tax Bill : పార్లమెంటులో కొత్త ఇన్‌కమ్‌ టాక్స్‌ బిల్లు.. వచ్చే వారం ప్రవేశపెట్టనున్న సీతారామన్

New Income Tax Bill : పార్లమెంటులో కొత్త ఇన్‌కమ్‌ టాక్స్‌ బిల్లు.. వచ్చే వారం ప్రవేశపెట్టనున్న సీతారామన్
Advertisement

New Income Tax Bill |పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు (New Income Tax Bill)ను వచ్చే వారం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ఈ బిల్లు ఆరు దశాబ్దాల క్రితమే అమల్లో ఉన్న ఐటీ చట్టానికి బదులుగా రూపొందించబడింది. బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన తర్వాత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించి, దాని సిఫార్సుల ఆధారంగా మళ్లీ పరిశీలనకు వేయనున్నారు. శుక్రవారం ఫిబ్రవరి 7, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో బడ్జెట్ అనంతర సమావేశంలో ప్రసంగించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆమె తెలిపిన ప్రకారం, పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు తర్వాత బిల్లును మళ్లీ కేబినెట్ పరిశీలన కోసం పంపుతారు. కేబినెట్ ఆమోదం తర్వాత మళ్లీ పార్లమెంటులో ప్రవేశపెడతారని ఆమె చెప్పారు. బిల్లు విషయంలో ఇంకా మూడు క్లిష్టమైన దశలు మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేసారు.

Advertisement

‘రెండు సంవత్సరాల క్రితం కస్టమ్స్ డ్యూటీని సరళీకరించినట్లే, ఇప్పుడు ఆదాయపు పన్నును కూడా సరళీకరించాలనుకుంటున్నాం. భారతదేశాన్ని పెట్టుబడిదారులు, వాణిజ్య రంగానికి మరింత స్నేహపూర్వకంగా మార్చాలనుకుంటున్నాం. అదే సమయంలో, ఆత్మనిర్భర భారత్ లక్ష్యంతో సమతుల్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పరిశ్రమలకు అవసరమైన సుంకాల రక్షణను కూడా అందిస్తాం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.

Also Read: సిబిల్ స్కోర్‌తో పెళ్లి క్యాన్సిల్.. వరుడికి షాకిచ్చిన అత్తమామలు

Advertisement

కొత్త ఆదాయపు పన్ను బిల్లు: ఎందుకు అవసరం?
ఫిబ్రవరి 1, 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమర్పించే సందర్భంగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లు గురించి మాట్లాడారు. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని కూడా ప్రకటించారు. అయితే.. ఈ కొత్త బిల్లు ఎందుకు అవసరమైంది దానిలో కొత్తగా ఏమి ఉంది అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం రద్దు
పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టి, ఉభయ సభల ఆమోదం తర్వాత, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం 1961ను రద్దు చేస్తుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అప్‌టు-టు-డేట్‌గా ఉంటుంది. భారత పార్లమెంటు 1961లో ఆమోదించిన ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1, 1962 నుండి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ చట్టానికి అనేక సవరణలు జరిగాయి మరియు కొత్త నిబంధనలు జోడించబడ్డాయి. ఈ కారణంగా ఈ చట్టం చాలా క్లిష్టంగా మారింది.

కొత్త అవసరాలకు అనుగుణంగా కొత్త బిల్లు
అధికార వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. పన్నుల వ్యవస్థను సరళంగా మరియు పారదర్శకంగా మార్చడానికి ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లులో నిబంధనలు ఉన్నాయి. దీంతో, ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించే భాష గతంలో కంటే సరళంగా మారుతుంది. పన్నులు చెల్లించే ప్రక్రియ కూడా సులభం అవుతుంది. 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం రూపొందించబడిందని అధికార వర్గాలు తెలిపాయి. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో, పన్ను చెల్లింపుదారులు చాలా పనులను స్వయంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు రిటర్న్‌లు దాఖలు చేసేవారికి, పన్ను నిపుణులకు సరళమైన, సమగ్రమైన నిబంధనలు ఈ బిల్లులో ఉంటాయి. వీటిని అందరూ సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఆదాయపు పన్ను కేసులను తగ్గించే ప్రయత్నాలు
పన్ను దాఖలు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా, భవిష్యత్తులో ఆదాయపు పన్ను పత్రాలు (ITR Filing) దాఖలు చేసేటప్పుడు పేపర్ వర్క్ అవసరం తగ్గుతుంది. ప్రజలు సులభంగా రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను సంబంధిత కేసులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం వివిధ కేసుల్లో శిక్ష, జరిమానాలను తగ్గించే నిబంధనలు కూడా ఈ బిల్లులో ఉండవచ్చు.

పన్ను వ్యవస్థలోకి ఎక్కువ మందిని చేర్చే లక్ష్యం
ఈ బిల్లును తీసుకురావడం వెనుక ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటంటే, ఎక్కువ మందిని పన్ను వ్యవస్థలోకి చేర్చాలని. అయితే, ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లులో కొత్త పన్ను విధానం (New Income Tax Regime)కు సంబంధించిన ప్రొవిజన్‌లు ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం, అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో ఈ కొత్త పన్ను విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×