E-Paper
Advertisement

Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

Electric Shock: ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో కరెంట్ షాక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం రోజుల క్రితమే జన్మాష్టమి వేడుకల్లో శోభయాత్రలో రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.. దీని తర్వాత రెండు రోజులకే వినాయకుడిని తీసుకెళుతుండగా.. కరెంట్ షాక్ తగిలి మరో ఇద్దరు మరణించారు. అయితే ఇది మరువక ముందే రో ఘటన చోటు చేసుకుంది.

కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం
హైదరాబాద్‌లో కరెంట్‌ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మేడ్చల్ తిరుమలగిరి ప్రాంతంలో విద్యుత్ వైర్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి చెందిన లక్కీ అనే యువకుడు బొల్లారం రిసాల బజార్‌లోని ఓ టెంట్ హౌస్‌లో కూలీగా పని చేస్తున్నాడు. ఓ శుభకార్యానికి వేసిన టెంట్ తొలగిస్తుండగా విద్యుత్ వైర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి.

ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
అయితే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో మున్నా, విజయ్, సంతోష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

6 రోజుల వ్యవధిలో 10 మంది మృతి
ఇక హైదరాబాద్‌లో 6 రోజుల వ్యవధిలో కరెంట్‌ షాక్‌లతో 10 మంది మృతి చెందారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం కరెంట్ షాక్ ఘటనలపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటుంది.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×