E-Paper
Advertisement

Thandel : అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కారణంగా ‘తండేల్’ సినిమా రూపొందిందని తెలుసా?

Thandel : అల్లు అర్జున్  ఆటోగ్రాఫ్ కారణంగా ‘తండేల్’ సినిమా రూపొందిందని తెలుసా?
Advertisement

Thandel : అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘తండేల్’ (Thandel). ఈ మూవీ మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ (Allu Arjun) కారణంగా ఈ మూవీ తెరపైకి వచ్చిందనే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అల్లు అర్జున్ కు, తండేల్ మూవీతో ఉన్న లింక్ ఏంటి? ఆయన కారణంగా ఈ మూవీ ఎలా పట్టాలెక్కింది అనే వివరాల్లోకి వెళితే…

అల్లు అర్జున్ వల్లే ‘తండేల్’ మూవీ తెరపైకి…

Advertisement

‘తండేల్’ మూవీ పాక్ జైల్లో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్ల వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా, అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కింది ఈ మూవీ. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన తండేల్ 4 రోజుల్లోనే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాకు అల్లు అరవింద్ తనయుడు, ఐకాన్ స్టోర్ అల్లు అర్జున్ తో లింక్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. తాజా సమాచారం ప్రకారం ఒక పాక్ జైలర్ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడిగాడని, అది ‘తండేల్’ మూవీ మేకింగ్ కి దారి తీసింది అని తెలుస్తోంది.

పాక్ జైలర్ బన్నీకి వీరాభిమాని 

Advertisement

పాక్ జైలర్ అక్కడ చిక్కుకున్న ఇండియన్ జాలర్లకు తన చిరునామా ఇచ్చి, అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ ను తనకు పంపమని అడిగిన సందర్భాన్ని నిర్మాత బన్నీ వాసు ఇటీవల వెల్లడించారు. పాక్ జైలులో ఉన్నప్పుడు ఇండియన్ జాలర్లకు ఆ జైలర్ హెల్ప్ చేశాడట. అంతేకాకుండా ఆయన అల్లు అర్జున్ కి పెద్ద అభిమాని. అందుకే మత్స్యకారులు ఇండియాకు తిరిగి వస్తున్నప్పుడు, అందులో ఒకరు ఒక రచయితను కలిసి విషయం చెప్పారట. దీంతో అతను ఆటోగ్రాఫ్ కోసం గీతా ఆర్ట్స్ ను సంప్రదించాడని తెలుస్తోంది. ఆ విధంగా అక్కడ జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న నిర్మాత బన్నీ వాసు ఈ మూవీని తీయాలని నిర్ణయించుకున్నారట.

కాగా శ్రీకాకుళం నుంచి మొత్తం 22 మంది జాలర్లు పాక్ జలాల్లోకి అనుకోకుండా ప్రవేశించి దాదాపు 13 నెలల పాటు అక్కడ జైలు శిక్షను అనుభవించారు. ఇదే స్టోరీ ఆధారంగా ‘తండేల్’ మూవీ తెరకెక్కింది.

ఇక ‘పుష్ప’ తరువాత అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా జరిగిన ఈవెంట్లో ‘పుష్ప :ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలలో మంగళం శ్రీను పాత్రను పోషించిన సునీల్ తన పాపులారిటీ ఎలా పెరిగిందో వెల్లడించారు. విదేశాల్లో పాక్ రెస్టారెంట్ యజమానులు తనను గుర్తు పట్టి, ఎలా ఆదరించారో వెల్లడించాడు. సునీల్ మాట్లాడుతూ రాత్రి పది గంటల తర్వాత ఓ రెస్టారెంట్ కోసం వెతుకుతున్నామని, అయితే ఓ రెస్టారెంట్ ఓనర్ తనను చూశాక ‘పుష్ప’ మూవీ నటుడని గుర్తించారని వెల్లడించారు. పాక్ రెస్టారెంట్ యజమానులు ఆ రెస్టారెంట్ ను క్లోజ్ చేసినప్పటికీ తమ కోసమే ఆ రాత్రి స్పెషల్ గా వంట చేశారని సునీల్ చెప్పుకొచ్చారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×