Strait of Hormuz: చమురు రవాణాకు అత్యంత కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిపై.. ఇరాన్ క్రమంగా పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయకుండా.. 80 శాతానికి పైగా నౌకలు.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నట్లు షిప్పింగ్ డేటా తెలియజేస్తోంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ డేటా ప్రకారం.. రెండు వారాలుగా హర్మూజ్ గుండా ప్రయాణిస్తున్న నౌకల్లో.. 80 శాతానికి పైగా ఒమన్ వైపు ఉన్న షిప్పింగ్ వాటర్ వేని ఉపయోగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆమోదం పొందిన ఈ మార్గాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. నౌకలు మాత్రం ఇప్పుడిదే రూట్ సేఫ్ అనుకుంటున్నాయ్.
నౌకాయాన స్వేచ్ఛపై ప్రత్యేక చర్చలు
నెల రోజుల కిందటి వరకు.. ఈ మార్గంలో రాకపోకలు దాదాపు శూన్యం. అయితే, అమెరికా నేవీ బలగాల రక్షణకు తోడు, సురక్షిత ప్రయాణం కోసం నౌకలు ఒమన్ మార్గాన్ని ఆశ్రయిస్తున్నాయి. దీనివల్ల.. ఈ జలసంధిలో.. ఇరాన్ వసూలు చేయాలనుకుంటున్న రవాణా, టోల్ ఫీజుల ప్రణాళిక దెబ్బతింది. ఇరాన్ దాడుల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు.. అనేక చమురు ట్యాంకర్లు తమ ట్రాన్స్పాండర్లని నిలిపివేసి.. డార్క్ ట్రాఫిక్గా మారుతున్నాయ్. మరోవైపు, ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతోందని అమెరికా ఇంధన శాఖ తెలియజేసింది. ఇది.. యుద్ధానికి ముందున్న స్థాయికి దాదాపు దగ్గరగా ఉంది. ఈ సంక్షోభం వేళ.. ఇరాన్, ఒమన్ మధ్య.. నౌకాయాన స్వేచ్ఛపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి.
ఇరాన్ వ్యూహానికి గండి..
ఈ పరిణామం ట్రంప్కు నచ్చలేదు. టెహ్రాన్, మస్కట్ మధ్య కుదిరే ఏ ఒప్పందమైనా.. షిప్పింగ్ సరళిని, జలసంధిపై నియంత్రణని సమూలంగా మార్చేస్తుందా? అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇరాన్, అమెరికా.. పూర్తి నియంత్రణని క్లెయిమ్ చేయలేని వాస్తవాన్ని.. షిప్పింగ్ ట్రాకింగ్ డేటా సూచిస్తోంది. ఏదేమైనా.. ఈ వ్యూహాత్మక జలమార్గంపై ఏ దేశానికీ సంపూర్ణ నియంత్రణ లేదనే విషయం స్పష్టమైంది. ఈ మార్పును బట్టి చూస్తే.. హర్మూజ్ గుండా వెళ్లే నౌకలపై.. ఇరాన్కు ఇకపై మునుపటి లాంటి నియంత్రణ ఉండకపోవచ్చని అర్థమవుతోంది.
Also Read: టీడీపీ కంచుకోటపై మిత్రపక్షాల కన్ను.. ఉత్తరాంధ్రలో మారిన పవన్, బీజేపీ వ్యూహం!