E-Paper
Advertisement

WarShip Accident North Korea: ఉత్తర కొరియాలో యుద్ద నౌక ప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యాన్ని నేరంగా పరిగణించిన నియంత కిమ్

WarShip Accident North Korea: ఉత్తర కొరియాలో యుద్ద నౌక ప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యాన్ని నేరంగా పరిగణించిన నియంత కిమ్
Advertisement

WarShip Accident North Korea| ఉత్తర కొరియా దేశంలో ఒక కొత్త యుద్ధనౌక ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశ నాయకుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ప్రమాదాన్ని ఆయన ఖండిస్తూ.. ఈ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని.. అయితే ఈ నిర్లక్ష్యాన్ని ఆయన నేర చర్యగా అభివర్ణించారు. ఈ ఘటన దేశ గౌరవాన్ని దెబ్బతీసిందని, దీనిని సహించలేమని ఆయన అన్నారు.

రాష్ట్ర మీడియా సంస్థ కేసీఎన్ఏ ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. కిమ్ జాంగ్ ఉన్ ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడే ఈ ప్రమాదం జరిగింది. 5,000 టన్నుల బరువున్న ఈ డిస్ట్రాయర్ యుద్ధ నౌక ప్రారంభం (సముద్రంలోకి లాంచ్) విఫలమైంది. ఈ ప్రమాదం దేశ గౌరవాన్ని దిగజార్చిందని, నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగిందని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌లో జరగనున్న ప్రధాన రాజకీయ పార్టీ సమావేశానికి ముందు ఈ నౌకను సరిచేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ఈ ప్రమాదం తూర్పు తీరంలోని చోంగ్‌జిన్ ఓడరేవులో జరిగింది. సముద్రంలోకి నౌక లాంచ్ సమయంలో సమతుల్యత కోల్పోవడం వల్ల ఈ సంఘటన సంభవించిందని కేసీఎన్ఏ తెలిపింది. నౌక దిగువ భాగంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని, నౌక దెబ్బతినడం వల్ల ఎంత నష్టం జరిగిందో వివరాలను స్పష్టంగా వెల్లడించలేదు. ఈ సంఘటన గురించి కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ.. ఇది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అవైజ్ఞానిక పద్ధతుల వల్ల జరిగిన తీవ్రమైన ప్రమాదమని అన్నారు. ఈ ప్రమాదం దేశ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఆయన నేరచర్యలగా చెప్పారు. నౌకను సరిచేయడం కేవలం సాంకేతిక సమస్య కాదని, ఇది దేశ అధికారంతో నేరుగా ముడిపడిన రాజకీయ సమస్య అని ఆయన అన్నారు.

ఈ ప్రమాదం గురించి బహిరంగంగా వెల్లడించడం చాలా అరుదు. గతంలో ఉత్తర కొరియాలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఉదాహరణకు అంతరిక్ష వాహన ప్రయోగ వైఫల్యాలు లేదా పౌరులకు సంబంధించిన విపత్తులు జరిగినప్పుడు, రాజకీయ నాయకత్వం, వర్కర్స్ పార్టీ సమస్యలను సరిచేయడంలో తమ పాత్రను ప్రచారం చేసుకున్నాయి. ఈ ఏడాది ఉత్తర కొరియా 5,000 టన్నుల బరువు గల రెండు డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు ప్రారంభించింది. ఇవే ఆ దేశంలో ఇప్పటివరకూ అతిపెద్ద యుద్ధనౌకలుగా ఉన్నాయి. ఏప్రిల్‌లో పశ్చిమ తీరంలోని నాంఫో షిప్‌యార్డ్‌లో కిమ్ జాంగ్ ఉన్ హాజరైన మరో డిస్ట్రాయర్ సముద్రంలోకి లాంచ్ అయిందని కేసీఎన్ఏ నివేదించింది.

Advertisement

Also Read: సిగరెట్ లైటర్ సైజులో మొబైల్.. క్రిమినల్స్ కోసం స్పెషల్!

అయితే తాజాగా జరిగిన ఈ ప్రమాద నౌక ప్రారంభానికి సంబంధించిన సన్నాహాల గురించి అమెరికాకు చెందిన 38 నార్త్ అనే సంస్థ గత వారం ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నౌకను ఓడరేవు నుండి పక్కకు జార్చి సముద్రంలోకి ప్రవేశింప జేసే పద్ధతిని ఉపయోగించినట్లు తెలిపింది. ఈ పద్ధతి ఉత్తర కొరియాలో గతంలో ఎప్పుడూ ఉపయోగించలేదని 38 నార్త్ పేర్కొంది. ఈ కొత్త పద్ధతితో లాంచ్ చేయడానికి కారణం ఆ ఓడరేవులో తగిన స్థలం లేకపోవడమని తెలిపింది. ప్రమాదానికి ఒక రోజు ముందు తీసిన ఉపగ్రహ చిత్రాల్లో నౌక ఓడరేవులో ఉండగా, దాని పక్కన సహాయక నౌకలు ఉన్నట్లు కనిపించాయి.

ఈ ప్రమాదంతో ఉత్తర కొరియా సాంకేతిక నైపుణ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. కిమ్ జాంగ్ ఉన్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి, నౌకను త్వరగా సరిచేయాలని ఆదేశించారు. ఈ సంఘటన దేశ రాజకీయ చిత్రాన్ని, అంతర్జాతీయ గౌరవాన్ని ప్రభావితం చేసే అంశంగా మారింది.

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×