E-Paper
Advertisement

Education Ministry: నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

Education Ministry: నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
Advertisement

NEET Paper Leak Row: నీట్‌ పేపర్‌ లీకేజ్ అంశంపై కేంద్రం ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులుంటారు. ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌.. కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ప్రవేశపరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండటం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. రెండు నెలల్లోగా ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ కమిటీలో హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. బి.జె. రావు, ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కే రామమూర్తి, కర్మయోగి భారత్‌ సహ వ్యవస్థాపకులు పంకజ్‌ బన్సల్‌, ఐఐటీ ఢిల్లీ డీన్‌ ప్రొఫెసర్‌ ఆదిత్య మిత్తల్‌, కేంద్ర విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు.

Advertisement

Also Read: అయోధ్య రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత

నీట్‌, నెట్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడంతో ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌ 2024ను కూడా కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా వారిపై చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశముంది.

Advertisement

Tags

Related News

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

Big Stories

Advertisement
×