E-Paper
Advertisement

PM Removal Bill: బాబు-నితీష్‌ కట్టడికి ఆ బిల్లు.. కాంగ్రెస్ ఆరోపణలు, ఇరకాటంలో బీజేపీ

PM Removal Bill: బాబు-నితీష్‌ కట్టడికి ఆ బిల్లు.. కాంగ్రెస్ ఆరోపణలు, ఇరకాటంలో బీజేపీ
Advertisement

PM Removal Bill: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ఠ మసకబారుతోందా? పీఎం, సీఎం, మంత్రుల ఉద్వాసన బిల్లుపై లోక్‌సభలో ఏం జరిగింది? ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఆ బిల్లు ఎందుకు తెచ్చింది? దీనివెనుక ఏమైనా స్కెచ్ ఉందా? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను వెంటాడుతున్నాయి.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితులు నెలకున్నాయి. కేంద్రంలో మూడు పర్యాయాలు ఎన్డీయే అధికారంలో ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై స్వతహాగా ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. ఈ క్రమంలో మిత్రులు చేజారిపోకుండా బీజేపీ పెద్ద స్కెచ్ వేసినట్టు చెబుతోంది కాంగ్రెస్ పార్టీ.

Advertisement

బుధవారం లోక‌సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నేరాభియగాలున్న నేతల తొలగింపు విషయమై ఆ బిల్లు కీలకమైంది. నేతలు అరెస్టయి 30 రోజులు జైలులో ఉంటే ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు 31 రోజున పదవి నుంచి తొలగించడం అనేది ఆ బిల్లు ఉద్దేశం.

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ-కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీల ప్రభుత్వాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లు తెచ్చారన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, సీఎం నితీష్ కుమార్ ల కోసమే ఈ బిల్లు తెచ్చారని ఆరోపించారు.

Advertisement

ALSO READ: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అలా చేస్తే కోటి జరిమానా

బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ బిల్లు తెచ్చారని అన్నారు.దీనిపై బీజేపీ సభ్యులు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై ఇంటా బయటా  జాతీయ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. చివరకు విపక్ష సభ్యులు సైతం బిల్లును చింపేసి హోంమంత్రి అమిత్ షాపై విసిరారు కూడా.  పరిస్థితి గమనించిన ఈ బిల్లు జేపీసీకి వెళ్లింది.

కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.  ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, జేడీయూ మద్దతు లేకుంటే మోదీ ప్రభుత్వం కుప్పకూలుతుందని అంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు ఈ బిల్లు తెచ్చారని కాంగ్రెస్ నేతల వెర్షన్.

ఎందుకంటే.. టీడీపీ, జేడీయూ రెండు పార్టీలు గతంలో కాంగ్రెస్‌తో జతకట్టాయి. ఆ తర్వాత రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు దూరమైన తర్వాత ఎన్డీయేకు మద్దతు పలికాయి. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయం సాధించింది. బీహార్‌లో అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు.  జరిగిన.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లు జేపీసీ‌కి వెళ్లింది.  పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో జేపీసీ నివేదిక ఇవ్వనుంది.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×