E-Paper
Advertisement

OTT Movie : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్

OTT Movie : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఇప్పుడు మలయాళం సినిమాలకి క్రేజ్ బాగా పెరిగింది. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ చివరివరకూ ట్విస్టులతో  ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

సారా (మమతా మోహన్‌దాస్) అనే మలయాళీ యువతి బెంగళూరులో నర్సుగా పని చేస్తూ ఉంటుంది. ఆమె భర్త టామ్ (శిజోయ్ వర్ఘీస్) తో కలసి జీవిస్తూ ఉంటుంది. ఒక రోజు ఈ దంపతులు తమ కూతురు పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో పార్టీ తర్వాత టామ్ ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతాడు. దీనివల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళి అతను మరణిస్తాడు. సారా కంప్లైంట్ చేయడంతో పోలీసు అధికారి డిసిపి గణేష్ హెగ్డే (రాహుల్ దేవ్ శెట్టి) విచారణ ప్రారంభిస్తాడు. ఇది హత్యా, ఆత్మహత్యా లేదా సహజ మరణమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూంటాడు. ఈ దర్యాప్తులో భాగంగా పుట్టిన రోజుకి హాజరైన ఏడుగురితో పాటు సారాని కూడా ప్రశ్నిస్తారు. పోస్ట్ మార్టం లో విష ప్రయోగం జరిగినట్టు తేలుతుంది. దీంతో ఇది సహజ మరణం కాదని ఒక క్లారిటీకి వస్తారు పోలీసులు.

ఈ విష ప్రయోగం హత్యా, ఆత్మ హత్యా అన్న కోణం లో విచారణ చేస్తాడు డిసిపి గణేష్ హెగ్డే. విచారణలో దిమ్మ తిరిగే విషయాలు బయటికి వస్తాయి. ప్రధాన అనుమానితుల్లో టామ్ స్నేహితులు, సహోద్యోగులతో బాటు భార్య సారా కూడా వుంటుంది. సారా రాసుకున్న డైరీలో టామ్ తో అంత మంచి సంబంధాలు లేవని తెలుస్తుంది. డిసిపి హెగ్డే విచార కొనసాగిస్తూ పోతూంటే చివరికి దోషి ఎవరో తెలుసుకుని షాక్ అవుతాడు. చివరికి టామ్ ని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? డిసిపి గణేష్ హెగ్డే వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఫోన్ లో అసభ్యంగా వేధించే సైకో గ్యాంగ్ … ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే ఫ్యూజులు అవుట్

 

జీ 5 (Zee 5) లో

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లాల్‌బాగ్’ (Lalbagh). 2021 లో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రశాంత్ మురళీ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. ఇందులో మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలో నటించింది. నేహా సక్సేనా, రాహుల్ మాధవ్, రాహుల్ దేవ్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా స్టోరీ బెంగళూరు నగరంలో ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. ఈ మూవీ జీ 5 (Zee 5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×