BigTV English

Team India Retainership 2024-25 : BCCI కాంట్రాక్ట్.. శ్రేయస్ సూపర్ కమ్‌బ్యాక్.. ఎవరికి ఏ గ్రేడ్ అంటే ?

Team India Retainership 2024-25 : BCCI కాంట్రాక్ట్.. శ్రేయస్ సూపర్ కమ్‌బ్యాక్.. ఎవరికి ఏ గ్రేడ్ అంటే ?

Team India Retainership 2024-25 : సాధారణంగా టీమిండియా క్రికెటర్ ఎప్పుడూ ఏ ఆటగాడు ఏ గ్రేడ్ లో ఉంటాడో అస్సలు ఊహించలేము. ఫామ్ కోల్పోవడం, ఫామ్ లో ఉండటం వల్ల రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. గత ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్  కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్ అద్భుమైన ఫామ్ తో తిరిగి రిటైనర్ షిప్ దక్కించుకున్నారు. ఛాంపియిన్స్ ట్రోఫీలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేయడంతో కేకేఆర్ కి ఐపీఎల్ ట్రోఫీ అందించారు. డొమెస్టక్ క్రికెట్ లో కూాాడా పరుగుల వరద పారించారు. దీంతో బీసీసీఐ అతన్ని బీ కేటగిరిలో చేర్చింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనలతో గత ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ పై బీసీసీఐ కరుణ చూపింది. అతడిని సీ కేటగిరిలో చేర్చింది.


Also Read : Daggubati Rana: WWE రెసిల్ మేనియా 41 ఈవెంట్‌లో రానా దగ్గుబాటి

టీమిండియా క్రికెట్ లో గ్రేడ్ లను పరిశీలించినట్టయితే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,  బుమ్రా, రవీంద్ర జడేజా A+ గ్రేడ్ లో కొనసాగుతున్నారు. గ్రేడ్ A లో మహ్మద్ సిరాజ్, కే.ఎల్. రాహుల్, శుబ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నారు. అలాగే గ్రేడ్ B లో సూర్య కుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ కొనసాగుతున్నారు. గ్రేడ్ సీ లో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా C గ్రేడ్ లో కొనసాగుతున్నారు. 


కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి వారు A+ గ్రేడ్ లో కొనసాగడం విశేషం. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలిలో అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగిస్తుండటం.. బుమ్రా బౌలింగ్ వేస్తుండటం.. జడేజా బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో సత్తా చాటే కీలక ఆటగాడు అనే చెప్పవచ్చు.  బీసీసీఐ తాజాగా సంవత్సర ఆదాయానికి సంబందించిన 2024-25 టీమీండియా సీనియర్ మెన్స్ క్రికెట్ ఆటగాళ్లు. భారత జట్టు తరపున నమ్మకమైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా, రోహిత్ శర్మ  వంటి కీలక ఆటగాళ్లు ఉంటారు. వీరి తప్పకుండా రాణిస్తుంటారు. వీరిలో చాలా తక్కువ మంది ఫామ్ కోల్పుతుంటారు. అలా ఫామ్ కోల్పోకూడదని BCCI  వీరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తుంటుంది. ఒకవేళ కోల్పోయిన వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. ఇలాంటి సందర్భంగా శ్రేయస్ అయ్యర్ కమ్ బ్యాక్ అనే చెప్పాాారు. ఇందులో మీరు ఏ వ్యక్తికి మద్దతు తెలుపుతారో.. వారు ఇప్పుడు ఏ టమ్ కి ఆడతారో వేచి చూడాలి.

 

Related News

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

Big Stories

×