E-Paper
Advertisement

Karnataka IT Companies: ఐపీఎల్ ఫైనల్స్.. RCB కోసం కంపెనీలకు హాలిడే

Karnataka IT Companies: ఐపీఎల్ ఫైనల్స్.. RCB కోసం కంపెనీలకు హాలిడే
Advertisement

Karnataka IT Companies: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ బీకర ఫైట్ జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. రాత్రి 7 గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉండే ఛాన్సులు ఉన్నాయి.

Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ

Advertisement

ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కంపెనీలకు సెలవులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో… కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సంబంధించిన కొన్ని ఐటీ అలాగే వివిధ సంస్థలు… సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులందరికీ… సెలవులు ప్రకటిస్తూ… షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ లో ఉన్నాను నేపథ్యంలో… ఎలాగైనా టైటిల్ గెలవాలని కర్ణాటక ప్రజలు కూడా పూజలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఐటీ అలాగే వివిధ సంస్థల ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. ఇవాళ మంగళవారం వర్కింగ్ డే కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక మరికొన్ని కంపెనీలు అయితే తమ ఆఫీసులోనే లైవ్ స్ట్రీమింగ్.. ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు కర్ణాటక రాష్ట్రంలో విద్యాసంస్థలకు హాలిడే ఇవ్వాలని ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కొంతమంది లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read:  PBKS vs RCB final : 10 సంవత్సరాల ఛాలెంజ్.. బుమ్రా యర్కార్లకు శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే ఆన్సర్.. అప్పుడు… ఇప్పుడు అదే షాట్

విలన్ గా మారిన వర్షం

నేడు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఆటంకం కలిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో( Narendra Modi Stadium in Ahmedabad ) జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభ సమయానికి వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా స్టేడియం మొత్తం కవర్లతో నింపేశారు. మ్యాచ్ ( Match) ప్రారంభ సమయానికి వర్షం తగ్గితే మ్యాచ్ ను ప్రారంభిస్తారు. ఒకవేళ ఈ రోజు మొత్తం వర్షం తగ్గకుండా కురిసినట్లయితే రేపు యధావిధిగా మ్యాచ్ ను కొనసాగిస్తారు. రేపు కూడా వర్షం పడినట్లయితే సూపర్ ఓవర్ ను నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సూపర్ ఓవర్ విధానం కూడా సాధ్యం కాలేకపోయినట్లయితే పంజాబ్ కింగ్స్ జట్టును ( Punjab kings) టైటిల్ విజేతగా ప్రకటిస్తారు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఆ కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టును కాకుండా పంజాబ్ కింగ్స్ జట్టును విజేతగా ప్రకటిస్తారు.

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×