V. Hanmantha Rao: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు ఇంట్లో ఇటీవల మున్నూరు కాపు నేతల సమావేశం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనపై ఏఐసీసీ సీరియన్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై వీహెచ్ హనుమంతరావు స్పందించారు.
ALSO READ: CM Revanth Reddy: కనీసం ఒక్కసారైనా వాళ్ల గురించి KCR పట్టించుకున్నారా..?: సీఎం రేవంత్
తన ఇంట్లో బీసీ నేతలతో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని వీహెచ్ చెప్పారు. అయితే, బీసీ కులగణనకు సంబందించి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా సహకరిస్తామని తెలిపారని, త్వరలోనే వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతున్నామని తెలిపారు. సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే ఆయనతో మాట్లాడిన తర్వాత మున్నూరు కాపు సభ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తామో చెబుతామని వీచ్ హన్మంతరావు చెప్పారు.
ALSO READ: Gaddar Awards: తెలుగు సినీ పరిశ్రమకు మహర్దశ.. గద్దర్ అవార్డులు ఇచ్చే డేట్ అనౌన్స్
పార్టీలో కొంత మంది తనపై కోపంగా ఉండొచ్చని.. కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి చెడు చేయనని అన్నారు. ఇటీవల వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని వార్తలు రావడంతో.. కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యకం చేసింది. ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం అవ్వడం ఏంటని.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సొంత ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ఏఐసీసీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
ALSO READ: PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.1,05,280
ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎదురుచూస్తున్న కులగణన చేస్తే మెచ్చుకోవాల్సింది.. పోయి.. విమర్శలు చేయడంపై ఏఐసీసీ ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి.. ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్ కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై తక్షణమే సమాధానం చెప్పాలని మండిపడినట్లు వార్తలు రావడంతో వీహెచ్ క్లారిటీ ఇచ్చారు. బీసీ నేతలతో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని వీహెచ్ చెప్పారు. అయితే, బీసీ కులగణనకు సంబందించి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా సహకరిస్తామని తెలిపారని, త్వరలోనే వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతున్నామని తెలిపారు.