BigTV English

Hyderabad Chutneys: చట్నీస్ రెస్టారెంట్లపై అధికారులు దాడులు.. కిచెన్లలో బొద్దింకలు, ఎలుకులు.. కంపువాసన

Hyderabad Chutneys: చట్నీస్ రెస్టారెంట్లపై అధికారులు దాడులు.. కిచెన్లలో బొద్దింకలు, ఎలుకులు.. కంపువాసన

Hyderabad Chutneys: హైదరాబాద్ లో చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పలు హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్టు పేర్కొన్నారు. వంట గదిల్లో బొద్దింకలు, ఎలుకులు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పలు హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.


చట్నీస్ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు FSSAI నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హోటల్స్‌ కిచెన్లలో ఉన్న ఫ్రిడ్జ్‌లలో బొద్దింకలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ఛట్నీస్ హోటల్స్‌కు నోటీసులు ఇచ్చారు. హోటల్‌లో పనిచేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేనట్లుగా అధికారులు వివరించారు.

హోటళ్లలో పాత్రలు సరిగ్గా లేవని కాలం చెల్లిన వస్తువులను చట్నీల్లో వాడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ రెస్టారెంట్‌పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటన చట్నీస్ రెస్టారెంట్‌ల యాజమాన్యంపై ఒత్తిడిని పెంచింది. ఎందుకంటే ఈ రెస్టారెంట్లు హైదరాబాద్‌లో దక్షిణ భారత ఆహారం కోసం ప్రసిద్ధి చెందినవి.


ALSO READ: Guntur News: గుంటూరు జిల్లాలో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

ఈ ఘటన ఆహార భద్రతా నిబంధనల పట్ల రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరిని బహిర్గతం చేసింది. అధికారులు హైదరాబాద్‌లోని ఇతర ప్రముఖ రెస్టారెంట్లలో కూడా తనిఖీలను కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఏవైనా లోపాలను సహించబోమని వారు హెచ్చరించారు. ఈ తనిఖీలు రెస్టారెంట్ యాజమాన్యాలకు ఒక హెచ్చరికగా పనిచేస్తాయి. ఆహార నాణ్యత, పరి శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపాలని సూచిస్తున్నాయి.

ALSO READ: Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి

ఈ సంఘటన ప్రజలలో కూడా చర్చనీయాంశంగా మారింది. చట్నీస్ వంటి ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఇటువంటి లోపాలు ఉండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. ఆహార భద్రతపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రెస్టారెంట్లు తమ ప్రమాణాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేసింది.

Related News

KTR: గ్రూప్-1 పోస్టులను రూ.1700 కోట్లకు అమ్ముకున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Warangal Congress Clash: వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన విభేదాలు..

Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి

Krishna Water Dispute: ఈ నెల 23న ఢిల్లీలో.. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 సమావేశం

Drug Racket: స్కూల్ ముసుగులో.. మత్తు పదార్థాల దందా..

Jagga Reddy Humanity: కళ్లు కనిపించని ఆ బాలుడి పాట విని చలించిపోయిన జగ్గారెడ్డి.. స్పాట్‌లోనే ఎన్ని లక్షలు ఇచ్చారంటే?

Karimnagar: బట్టలు ఆరేసుకోడానికి రూ.200 కోట్లతో ఈ బ్రిడ్జి కట్టారా? ఇదెక్కడి మాస్ మామ!

Big Stories

×