BRS Survey: స్వేచ్చ బ్యూరో: గులాబీ పార్టీలో ఇప్పుడు ‘సర్వే’ సెగ సెగలు పుట్టిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీకొట్టేందుకు గులాబీ అధిష్ఠానం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిని జల్లెడ పడుతోంది. నియోజకవర్గాల్లో నేతల పనితీరు ఎలా ఉంది? ప్రజల్లో ఎవరి గ్రాఫ్ ఎంత పెరిగింది? ఎవరిది పడిపోయింది? అనే అంశాలపై గులాబీ బాస్ నిశ్శబ్దంగా నిఘా పెట్టారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలతో ప్రతి నియోజకవర్గంలోనూ అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
హైదరాబాద్ వీడరు.. జనాన్ని పట్టించుకోరు!
కొందరు నేతలు నియోజకవర్గాలను గాలికొదిలేసి, హైదరాబాద్లోనే మకాం వేస్తుండటంపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం రాజధానికే పరిమితవుతున్న నేతల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలపై పోరాడే వారికే భవిష్యత్తు ఉంటుందని, ఏసీ రూములకే పరిమితమైతే కుదరదని గట్టి సంకేతాలు పంపుతున్నారు.
Also Read: బెంగాల్ లోనే అధికారంలోకి వచ్చాం.. ఇక్కడ రాలేమా?- నితిన్ నబీన్
సోషల్ మీడియా ‘ట్రాక్’.. కేటీఆర్ యాక్షన్ ప్లాన్!
కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు.. సోషల్ మీడియాలో నేతల యాక్టివ్నెస్ ఎలా ఉందనే దానిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, పార్టీ వాయిస్ను బలంగా వినిపించడంలో ఎవరెవరు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారనే డేటాను సేకరిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా నేతల ‘పర్ఫామెన్స్ రిపోర్టు’లను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు లీడర్ల రిపోర్ట్ కార్డ్స్ తయారు చేస్తూ, పనితీరు మరీ దారుణంగా ఉన్నవారిని పిలిచి హెచ్చరిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా సర్, సభ్యత్వ నమోదు పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
హెచ్చరికలు జారీ
ఈ శిక్షణలో ముఖ్య నేతలతో భేటీ అవుతూ నియోజకవర్గాల వారిగా సర్వేలో వస్తున్న రిపోర్టులను ఆ నేతలకు ఇస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పనితీరు మెరుగుపరచుకోవాలని.. కేడర్ కు అందుబాటులో ఉండాలని… ప్రభుత్వ వ్యతిరేకంశాలపై మాట్లాడాలని.. పార్టీ చే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని.. గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేయాలని ఆదేశాలు కేటీఆర్ ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై సైతం నిగా పెట్టారు. వారిని సైతం పరోక్షంగా వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సర్వే రిపోర్టులు సైతం ఆయన నేతలకు ఇస్తున్నారు.
Also Read: జగన్ ‘యూ-టర్న్’.. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’.. పెన్షన్ల పెంపుపై ఎమ్మెల్యే నసీర్ సంచలన వ్యాఖ్యలు!
కేడర్ను వదిలితే.. కాలమే సమాధానం!
పార్టీ కోసం ప్రాణాలు పెట్టే కార్యకర్తలను, స్థానిక కేడర్ను విస్మరించే నేతలకు రాబోయే రోజుల్లో గడ్డుకాలం తప్పదని అధిష్ఠానం హెచ్చరిస్తోంది. కేడర్ను సమన్వయం చేసుకోకుండా, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేది లేదని స్పష్టం చేస్తోంది. ప్రజల్లో ఆదరణ లేని వారికి, కేడర్ మద్దతు కోల్పోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడం దాదాపు అసాధ్యమనే సంకేతాలు గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నిఘా ఎఫెక్ట్తోనైనా లీడర్లు రూటు మార్చి జనంలోకి వెళ్తారో లేదో చూడాలి!. బెస్ట్ శీర్షికలు ఇవ్వు