Fake Accreditation: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో నఖీలీ అక్రెడిటేషన్ కార్డు కలకలం రేపింది. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి మరీ చెలామని చేసారు. దీంతో ఓ నకిలీ కార్డు తయారు చేసి ఓ నఖీలీ రిపోర్టర్ చలామని అవుతున్నారు. ఇటీవల కొన్ని రోజులు క్రితం తెలంగాణ రాష్టవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది.
గతంలో జర్నిస్టులు అక్రెడిటేషన్ కలిగిన వారు సైతం వారి వివరాలను మరో సారి సరి చేసుకిని కొత్త కార్డులకు అప్లై చేసుకోనుటకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం కొన్ని కఠిన మైన నిబంధనలతో కూడిన పక్కా ప్రణాళికతో జర్నలిస్టు లకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో ఓ చానల్ పేరుతో ఓ వ్యక్తి ఏకంగా జిల్లా కలెక్టర్ సంతాన్ని ఫోర్జరీ చేసి మరీ మండల స్థాయి కార్డును శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ కార్డును తయారు చేసాడు.
Also read: వీఐ సరికొత్త ప్లాన్.. 6 నెలల వ్యాలిడిటీ.. 1800GB డేటా, అపరిమిత కాల్స్!
అయితే కార్డు తయారు చేసింది ఎవరు.. ఇంకా ఎన్ని కార్డులు ఇలా జిల్లాలో ఉన్నాయి.. కలెక్టర్ సంతకాలను ఫోర్జరీ చేసింది ఎవరు అనే అంశాలపై పోలీసులు విచారన చేస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో ఉన్న అంశం పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. సీపీ చైతన్యకు ఫిర్యాదు చేశారు. ఇలా ఏవరు చేశారు. దీనికి సంభందించిన వ్యక్తులను పట్టుకోని విచారించాలని కలెక్టర్ సీపీ సాయి చైతన్యకు తెలిపారు.
Also read: Ramchander Rao: నేటితో ఏడాది పూర్తి.. టీ బీజేపీ ప్రెసిడెంట్ ఇయర్ మార్క్ పాలిటిక్స్ ఇవే..!