Heavy Rains: నేటి నుంచి రానున్న మూడు రొజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా 30–40 కి.మీ. వేగంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరన శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని దీంతో వర్షం వచ్చు సమయంలో పిడుగు పడే ప్రాంతాల్లో ఉండకుండా ఇంటిలో నుండి ఎవరు భయటకు రావద్దని ధికారులు తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు భలంగా వస్తున్నాయిని దీంతో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.
వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఎర్పడనుందని ఆంద్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, సముద్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.
Also Read: Function Zone: సామాన్యులకు గుడ్ న్యూస్.. 25 వేలకే నెక్లెస్ రోడ్డులో ఫంక్షన్ హల్..!
ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉదని ఆంద్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. భారీ వర్షానికి గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా గమనిస్తూ దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Also read: Gadwal Police: డీఎస్పీ ఆఫీస్ పక్కనే మందు బాబుల సిట్టింగ్ వీరంగం.. పట్టించుకోని అధికారులు..?