E-Paper
Advertisement

Hyderabad drink-and-drive New Year: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. ఒక్క రోజులో 402 కోట్ల మద్యం విక్రయం

Hyderabad drink-and-drive New Year: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. ఒక్క రోజులో 402 కోట్ల మద్యం విక్రయం
Advertisement

Hyderabad drink-and-drive New Year| న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 31 రాత్రి భారీగా సంబరాలు జరిగాయి. నగరంలోని ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబం లేదా స్నేహితులతో పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో క్లబ్లులు పబ్ లలో మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగాయి. కేవలం ఒక్క రోజులోనే అంటే డిసెంబర్ 30, 2024న రాష్ట్ర వ్యాప్తంగా 402 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం.. 3,82,265 కేసుల మద్యం, 3,96,114 కేసుల బీరు కేసులు మొత్తం 7.7 లక్షల కేసులు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 2024 రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో అత్యధికంగా 21 నుంచి 30 ఏళ్ల వయసు కలవారే ఉండడం గమనార్హం. నగరం మొత్తంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

డిసెంబర్ 31, 2024 రాత్రి నుంచి జనవరి 1, 2025 ఉదయం వరకు మొత్తం 619 మందిని రాచకొండ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువగా 20 నుంచి 30 సంవత్సరాల వయసు లోపు ఉన్న యువకులే ఉన్నారు. అరెస్ట్ వారిలో వీరి సంఖ్య 262.

Also Read:  న్యూ ఇయర్ పార్టీ కోసం పబ్ వింత ఏర్పాట్లు.. కస్టమర్లకు కండోమ్, ఓఆర్ఎస్ ప్యాకెట్ల కానుకలు..

Advertisement

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన 619లో ఇద్దరు మైనర్లు ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారు 33 మంది ఉన్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. పోలీసుల జారీ చేసిన నివేదిక ప్రకారం.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అరెస్టు అయిన వారిలో 18-20 ఏళ్ల వయస్సు గల వారు.. 12 మంది, 21-30 ఏళ్ల వయస్సు కలవారు 262 మంది, 31-40 ఏళ్ల వయస్సు గల వారు 201 మంది, 41-50 సంవత్సరాల వయస్సు ఉన్నవారు.. 109 మంది, 51-60 ఏళ్ల వయస్సు గల వారు 30 మంది, 61-70 వయసు గల సీనియర్ సిటిజెన్లు ముగ్గురు ఉన్నారు. ఈ జాబితా మహిళలు లేకపోవడం.. అందరూ పురుషులే ఉండడం గమనార్హం.

మొత్తం 619 కేసుల్లో వాహనాల వారీగా చూస్తే.. పోలీసులు 526 టూ వీలర్లు (బైక్ లు), 26 తీ వీలర్లు (ఆటో రిక్షా), 64 ఫోర్ వీలర్ల (కార్లు, ట్రక్కులు) ను రాచకొండం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జాబితాలో మూడ ట్రక్కులు ఉన్నాయి.

ఎక్కువ శాతం కేసులు రాత్రి 1 గంట నుంచి ఉదయం 4 గంటల సమయంలో నమోదయ్యాయి. గత సంవత్సరం అంటే డిసెంబర్ 31, 2023న రాచకొండ పోలీసులు మొత్తం 431 డ్రంక్ అండ్ డ్రైవ్ (Hyderabad Drunk And Drive) కేసులు నమోదు చేశారు. కానీ అత్యధికంగా సైబరాబాద్ పోలీసులు 938 కేసులు నమోదు చేశారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×