E-Paper
Advertisement

Hyderabad Rain: హైదరాబాద్‌లో పట్టపగలే చీకటి.. భారీ వర్షాలు, ఈ ప్రాంతాలు జలమయం.. బయటకు వెళ్లొద్దు

Hyderabad Rain: హైదరాబాద్‌లో పట్టపగలే చీకటి.. భారీ వర్షాలు, ఈ ప్రాంతాలు జలమయం.. బయటకు వెళ్లొద్దు
Advertisement

Hyderabad Rain: హైదరాబాద్‌లో మళ్లీ మేఘాలు కమ్ముకున్నాయ్. ఆకాశం నీలంగా మారి, ఒక్కసారిగా వాన దంచికొట్టేసింది. మధ్యాహ్నం నుంచి పలుచోట్ల వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లకు వరుణుడు దర్శనమిచ్చాడు. ఈ ఏరియాల్లో వర్షప్రభావం ఎక్కువగా కనిపించింది. రోడ్డుపై వాహనదారులు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించగా, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. బైక్‌లు నడిపేవాళ్లు సిగ్నళ్ల దగ్గర వాన నుంచి తప్పించుకునేందుకు షెడ్లు, బిల్డింగ్‌ ల వద్దకు పరిగెత్తిన పరిస్థితి.

ఇక శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌, కంటోన్మెంట్‌, హకీంపేటలోనూ ఓ రేంజ్‌లో వర్షం కురిసింది. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఇన్నాళ్లు ఎండలతో అలసిపోయిన నగరానికి ఇదో కాస్త చల్లదనం ఇచ్చిన శుభవార్తే కానీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం ఊహించని సమస్యలు తెచ్చిపెట్టింది. డ్రైనేజులు పూర్తిగా నిండిపోవడంతో కొంత నీటి ప్రవాహం రోడ్లమీదికి వచ్చేసింది. కొన్ని కాలనీల్లో లోతట్టు ప్రాంతాలైనప్పుడు ఇంటి ముందు వరద నీరు నిలిచిపోయింది.

Advertisement

రాజేంద్రనగర్‌, చేవేళ్ల, ఇబ్రహీంపట్నం పరిధిలో మాత్రం పరిస్థితి కాస్త ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అక్కడ వర్షం కుండపోతగా కురిసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో ఆకాశం గర్జించింది. చిటపట చినుకులతో ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా కళ్ళు తిరిగేలా కురిసింది. ఎవరూ బయటకి రాలేని పరిస్థితి.

ఇబ్రహీంపట్నం వర్షంతో ముచ్చటైన సన్నివేశం కనిపించింది కానీ అక్కడి స్థానికులకు మాత్రం ఆ సౌందర్యం కంటే ఎక్కువగా భయం వేసింది. మెరుపులు చాలా దగ్గరగా పడినట్లు శబ్దమొచ్చింది. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సప్లై ఆగిపోయినట్లు సమాచారం. వర్షపు నీరు పొలాల్లోకి పోయి, పంటలను ముంచేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Also Read: Black chicken: ఒక్క కోడి ధరకే బుల్లెట్ వస్తుంది.. అయినా దీని డిమాండ్ ఫుల్!

వీటితో పాటు నగరంలోని రోడ్లపై ప్రయాణించేవాళ్లకు వాహన జామ్‌లు తలెత్తాయి. చిన్న వానకే ఇలా అయితే, ఇంకెంత వర్షం పడితే పరిస్థితి ఏంటనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. చాలా చోట్ల ట్రాఫిక్ పోలీస్‌లు నడిచి వెళ్లే లైన్లను క్లియర్ చేయడానికి తెగ కష్టపడ్డారు. సిగ్నళ్ల దగ్గర నీరు నిలిచిపోయి, బైక్‌లు నడవక ఇబ్బంది పడటం కామన్‌ సీన్ అయింది.

ఈ వర్షాలతో హైదరాబాద్ వాతావరణం చల్లగా మారింది. గడచిన కొన్ని రోజులుగా ఎండలు కాస్త తగ్గాయి. కానీ వర్షం ఎక్కువకాలం అలాగే కురిస్తే మాత్రం ప్రజలకు పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మెట్రోస్టేషన్లు, బస్సు స్టాప్‌లు పక్కనే వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు తడిచిపోయారు.

ఇక పాతబస్తీ ప్రాంతాల్లో అయితే కష్టాలు ఎక్కువ. సన్నని వీధులు, డ్రైనేజుల పరిస్థితి మామూలుగానే దారుణం. వర్షం పడితే అక్కడ నీరు నిలిచి, రోడ్డంతా కొలనులా మారిపోతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికపై అందరూ దృష్టి పెట్టాలి. జూలై 19, 20 తేదీల్లో కూడా నగరంలో రాగల వర్షాలపై హెచ్చరిక ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇళ్ల వద్దనే ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.

కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే పోలీసులు సైతం ఎప్పటికప్పుడు అత్యవసరమైతే సహాయక చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. కాగా రేపు, ఎల్లుండి ఇదే తరహా వర్షం కురిస్తే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×