Kaleshwaram: రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మిడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగిందని అన్నారు. కేంద్ర జలవిద్యుత్ పరిశోధనా సంస్థ వారు కేవలం ఏడవ బ్లాక్ నాణ్యత ప్రశ్నార్థకంగా ఉందంది. అన్నారం, సుంధిళ్ళలు బాగున్నాయని కితాబిచ్చిందని తెలిపారు.
ఒకటి నుండి ఆరు మరియు ఎనిమిదవ బ్లాక్ లు బాగున్నాయని, రేవంత్, ఉత్తంలు కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందో అని బేసజాలకు పోతున్నారని ఫైర్ అయ్యారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద వృధాగా పోతున్న నీటీనీ ఎలా వినియోగంలోకి తీసుకురావాలో చూడాలన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగంకు ప్రాణహిత ఒక్కటే ఆధారం, కాబట్టి, కన్నెపల్లి కింద కాపర్ డ్యాం నిర్మాణం చేయాలని అన్నారు. పంటలను కాపాడు కునేందుకు వృధాగా పోతున్న ప్రాణహిత నధీ జలాలను వాడుకోవాలన్నారు.
Also Reda: యూఏఈ సంచలనం.. ఎడారి ఇసుకతో ఇటుకలు.. 50% తగ్గనున్న కన్స్ట్రక్షన్ కాస్ట్!
తెలంగాణ ప్రజల గుండెళ్ళో కెసిఆర్ ఉన్నారు. కేంద్ర జల సంఘం రిపోర్ట్ పేరుతో ఇన్నాళ్లు దాగుడు మూతలు ఆడారు, ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఇకనైనా భేశాజాలకు వెళ్లకండి రేవంత్, ఉత్తం అని తెలిపారు. కళ్ళు తెరవండి సాగు నీరు మాత్రమే కాదు, త్రాగు నీటి సమస్య తలెత్తే అవకాశముందని, అవసరమైతే మేము ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read: అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?