Bus Accident: ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దదాపుగా 30 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురైనట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెలితే.. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కోన్నారు. దీంతో బస్సు లారీని ఢీకొని అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి.ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి మధిర వైపు వెలుతున్నట్టు పోలీసులు పేర్కోన్నారు.
Also Read: ఇరుముడి “మల్లెపూల పల్లకి” సాంగ్ లో రామ్ చరణ్.. చిత్ర బృందం క్లారిటీ!
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారనంగానే ఈ ప్రమాదానికి చేసిన కారణం అని బస్సులోని ప్రయాణికుల పేర్కోన్నారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: వాట్సప్లో సరికొత్త AI Scam Alert ఫీచర్.. ఇకపై ఫ్రాడ్ మెసేజ్లను ముందే కనిపెట్టేయొచ్చు!