E-Paper
Advertisement
హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

Dumping Yard: స్వేచ్ఛ బ్యూరో: నాలుగు జిల్లాల చెత్తతో హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా అని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి శివారులో సుమారు 125 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఉమ్మడి జిల్లాల డంపింగ్‌ యార్డు స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు.. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్యలను […]

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమం.. 70శాతంకు పైగా కాలిన గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమం.. 70శాతంకు పైగా కాలిన గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నాలు కలకలం రేపుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు డ్రైవర్లు బలవన్మరణానికి ప్రయత్నించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సంపేట డిపో డ్రైవర్‌ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో శంకర్ గౌడ్ శరీరం […]

ఎల్బీనగర్ అభివృద్దిపై సెక్రటేరియట్‌లో కీలక నిర్నయాలు
మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

మ్యూల్ ఖాతాలపై సజ్జనార్ సర్జికల్ స్ట్రైక్.. బ్యాంక్ అధికారులకు తప్పని అరెస్టులు!

Mule Accounts: స్వేచ్ఛ బ్యూరో: బ్యాంకుల్లో మ్యూల్​ ఖాతాలు ఉంటే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ స్పష్టం చేశారు. టార్గెట్లు కాదు…కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సేఫ్​ కస్టమర్​ ఛాలెంజ్​ దిశగా బ్యాంకర్లు అడుగులు వేయాలని చెప్పారు. ఒక్క అకౌంట్ హోల్డర్​ కూడా సైబర్​ నేరాల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. బంజారాహిల్స్​ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​ లో గురువారం వేర్వేరు బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. […]

RTC కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్.. ఆరు రోజులపాటు కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

Telangana Industry: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాకుండా ‘గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్’గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. తయారీ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ లోని […]

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఈ విచారణ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయనుంది. ముఖ్యమంత్రి […]

ఆర్టీసీ సమ్మె సస్పెన్స్.. 29 డిమాండ్లకు సర్కార్ ఓకే.. ఆ మూడింటిపైనే పీటముడి!

ఆర్టీసీ సమ్మె సస్పెన్స్.. 29 డిమాండ్లకు సర్కార్ ఓకే.. ఆ మూడింటిపైనే పీటముడి!

TSRTC strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉదంతం ఇప్పుడు ఒక జటిలమైన సమస్యగా మారింది. కార్మిక సంఘాలు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయా లేక నిజంగానే సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాయా అన్నది చర్చనీయాంశమైంది. అయితే, ఈ పోరాటంలో అటు కార్మికులు, ఇటు ప్రయాణీకులు ఇద్దరూ నలుగుతున్నారు. ముఖ్యంగా కొందరు కార్మికులు ఆత్మాహుతి ప్రయత్నాలకు పాల్పడటం అత్యంత విషాదకరం. సమస్యల పరిష్కారం చర్చల ద్వారా జరగాలి తప్ప, ప్రాణత్యాగాలు పరిష్కారం కావని మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తరపున […]

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

Medchal News: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ సురేష్ రెడ్డి వాహనం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. గతంలో పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం కౌన్సిలర్‌గా ఉన్నప్పటికీ, కారుపై ఇంకా ‘పీఏసీఎస్ చైర్మన్’ బోర్డు కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికార హోదాలను అనధికారంగా వాహనాలపై ప్రదర్శించడం స్పష్టమైన ఉల్లంఘన. అయినా ప్రజాప్రతినిధే ఇలా బహిరంగంగా నిబంధనలను ధిక్కరించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. Also read: వరి […]

ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరో మాట వద్దు, ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం నాడు పెను ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ మొండివైఖరి, పోలీసుల అణచివేత ధోరణిని నిరసిస్తూ శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా డిపో పరిసరాలు రణరంగంగా మారాయి. సమ్మెలో భాగంగా ఉదయం నుండి కార్మికులు డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. తమ నిరసనను తెలిపే […]

వరి పంటలో సరికొత్త రికార్డ్.. RNR 25105 వంగడం సిద్ధం..!
రూ.కోట్ల కుంభకోణం.. బాధితులకు అండగా ఉంటా, మంగ్లీ ఆవేదన

Big Stories

×