Pocharam Srinivas: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కొన్ని నెలల క్రితం బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్లిన ఆయన, మళ్లీ బిఆర్ఎస్లోకి వస్తారనే ప్రచారం జోరు అందుకుంది.
పోచారం పశ్చాత్తాపం.. పార్టీ వర్గాల్లో చర్చ
కేసీఆర్ను వీడి వెళ్లడం సరికాదని.. ‘అన్నం పెట్టిన వారిని మరవకూడదు’ అంటూ పోచారం భావోద్వేగానికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. బిఆర్ఎస్లో తగిన ప్రాధాన్యం పొందిన ఆయన, పార్టీ మారిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
కేటీఆర్ సూచనలు.. మారిన సమీకరణాలు
పోచారంపై బిఆర్ఎస్ నాయకులు ఎవరూ బహిరంగంగా విమర్శలు చేయవద్దని కేటీఆర్ పార్టీ నాయకులకు అంతర్గతంగా సూచించినట్లు సమాచారం. సీనియర్ నాయకుడు కావడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో ఆయన రాకను బిఆర్ఎస్ నాయకత్వం కూడా పరిశీలిస్తోంది. గతంలో విమర్శలు చేసిన నాయకులు ప్రస్తుతం మౌనంగా ఉండటం ఈ ప్రచారానికి మరిన్ని బలాన్ని చేకూరుస్తోంది.
బాన్సువాడలో గెలుపు గుర్రం
బాన్సువాడ నియోజకవర్గంలో పోచారానికి ప్రత్యామ్నాయంగా బలమైన నేత లేకపోవడం కూడా బిఆర్ఎస్ ఆలోచనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆయనకున్న పట్టు, ప్రజల్లో ఉన్న ప్రజాదరణ దృష్ట్యా ఆయన మళ్లీ బిఆర్ఎస్లోకి వస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
అయితే ఆయనకు గతంలో ఇచ్చినట్లే పార్టీలో సరైన గౌరవం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి. పోచారం తిరిగి గులాబీ గూటికి చేరితే, అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.
Also Read: హైడ్రాకు మద్దతుగా వృత్తి నిపుణులు.. కమీషనర్ ఏవీ రంగనాథ్తో భేటీ!