MLA Defection: తెలంగాణ హైకోర్టులో నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరిపారు. ఎమ్మెల్యేల అనర్హత పై హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు వినిపించారు. దీనిపై సెప్టెంబర్ 16కు తీర్పువెల్లడించునున్నట్టు హైకోర్టు పేర్కోంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ ఎస్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు.
కాంగ్రెస్కు ప్రచారం చేసిన వీడియోలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరుపు న్యాయవాది కోర్టుకు సమర్పించాడు. దీంతో అభివృద్ధి కోసం మాత్రమే కలిసి పని చేస్తున్నామని ఫిరాయింపు చేయలేదని ఎమ్మెల్యేలు అన్నారు. ఏఐసిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని వీరి వీడియోలు ప్రసారం అయ్యాయని అడ్వకేట్ తెలిపారు. పార్టీ కండువా కప్పుకున్నారని, జాతీయ జెండాగా చెబుతున్నారని అన్నారు.
Also Read: కెమెరా హిస్టరీలోనే బిగ్ చేంజ్.. 68MP స్క్వేర్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న కొత్త ఫోన్ ఇదే!
జాతీయ జెండాలో అశోక చక్ర ఉంటుందని గండ్ర మోహన్ రావ్, దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారని తెలిపారు. పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వరని గండ్ర మోహన్ రావ్ కోర్డుకు తెలిపారు. ప్రధాన పత్రికలు, టీవీ చానల్స్ లో కధనాలను కోర్టుకు న్యాయవాదులు సమర్పించారు.
Also Read: ముఖంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ అన్నీ క్లీన్.. గ్లోయింగ్ స్కిన్ కోసం సింపుల్ ఫేస్ ప్యాక్