E-Paper
Advertisement

తెలంగాణలో ‘బెంగాల్’ స్కెచ్ సాగదు.. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

తెలంగాణలో ‘బెంగాల్’ స్కెచ్ సాగదు.. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!
Advertisement

Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు, బీజేపీ వ్యూహాలు, అలాగే యాదగిరిగుట్ట బోర్డు నియామకాలపై రేగిన వివాదంపై ఆయన ఘాటుగా స్పందించారు. స్థానిక వేదికగా ఆయన మాట్లాడిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఓట్ల దొంగతనంతో గెలవలేరు!

Advertisement

పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా ఓట్లు దొంగిలించి, అడ్డదారిలో గెలవాలని చూస్తే ఇక్కడ సాధ్యం కాదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. విభజన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ.. ఇక్కడ కేవలం కులమతాల పేరిట చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే కొందరికి ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు గుర్తొస్తాయని, కానీ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు.

Also Read: ‘గొడ్డలి పార్టీ’ని తరిమికొట్టండి.. నెల్లూరు వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Advertisement

బీజేపీ – బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కానీ, అయోధ్యకు సంబంధించిన స్కామ్‌లపై కానీ బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. ఈ మౌనం చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న అంతర్గత అవగాహన (మ్యాచింగ్ ఫిక్సింగ్) స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి కనీసం రెండు సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.

నితిన్ నబీన్ వ్యాఖ్యలకు కౌంటర్

తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామంటూ బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచినంత మాత్రాన ప్రతిసారీ అదే రిపీట్ కాదని, ఈసారి కనీసం రెండు సీట్లు కూడా దక్కవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక భయపడుతున్నాయని, ప్రజలు కాంగ్రెస్‌ను మాత్రమే నమ్ముతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

యాదాద్రి బోర్డు వివాదంపై వివరణ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డులో కొణిదెల సురేఖ నియామకంపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డులో తెలంగాణ వాళ్లకు స్థానం దక్కినప్పుడు లేని అభ్యంతరం.. ఇక్కడ వస్తే ఎందుకు అని ప్రశ్నించారు. అయితే, యాదాద్రి ట్రస్టు సభ్యుల ఎంపిక విషయంలో స్థానిక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. బోర్డు సభ్యుల ఎంపికకు ముందు స్థానిక ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డిని సంప్రదించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేశారు.

Related News

ప్రాజెక్టు పూర్తిచేసే భాధ్యత నాదే.. హుస్నాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం భరోసా!

మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!

హైదరాబాద్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రాడ్.. రూ. 10 కోట్ల ఆస్తులు స్కామ్‌ చేసిన కేటుగాడు!

తండ్రి కర్మకాండల ఖర్చుల గొడవ.. అన్నను కత్తెరతో లేపేసిన తమ్ముడు!

తెలంగాణ పల్లె ప్రజలకు ఊహించని శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి భారీ గిప్ట్!

సాయం చేస్తానని వచ్చి.. రూ. 10 కోట్లు లేపేశాడు.. ఏకంగా 30 మందికి టోకరా!

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!

Big Stories

Advertisement
×