E-Paper
Advertisement

5 వారాల్లో 70 వేల టికెట్ల అమ్మకం.. ఎతిహాద్ రైల్‌ కు అదిరిపోయే రెస్పాన్స్!

5 వారాల్లో 70 వేల టికెట్ల అమ్మకం.. ఎతిహాద్ రైల్‌ కు అదిరిపోయే రెస్పాన్స్!
Advertisement

Etihad Rail Tickets: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లో కొత్తగా ప్రారంభమైన ఎతిహాద్ రైల్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సర్వీసులు మొదలైన కేవలం ఐదు వారాల్లోనే 70,000కు పైగా టికెట్లు సేల్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. యూఏఈలో ఇంటర్‌ సిటీ రైలు ప్రయాణానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు ఇదే నిదర్శనం అని చెప్పుకొచ్చింది.

జూన్ 30 నుంచి రైలు సర్వీసులు ప్రారంభం  

ఎతిహాద్ రైల్ తన ప్యాసింజర్ రైళ్లను జూన్ 30న ప్రారంభించింది. తొలిదశలో అబుదాబి నుంచి ఫుజైరా మధ్య రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభమైన కొద్దికాలంలోనే 70,000కు పైగా టికెట్లు అమ్ముడవడంతో సంస్థ సంతోష వ్యక్తం చేస్తోంది. ఎతిహాద్ రైల్ ప్రకారం.. ప్రయాణికులు తమ టికెట్లను సగటున 12 రోజుల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా కొత్త రవాణా వ్యవస్థ ప్రారంభమైనప్పుడు ప్రజలు ఆసక్తితో ఒకసారి ప్రయాణించి చూడటం సాధారణం. అయితే, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల రైలును తమ సాధారణ ప్రయాణానికి ఉపయోగించుకోవాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

ప్రస్తుతం పరిమిత మార్గంలోనే సర్వీసులు

Advertisement

ప్రస్తుతం ఎతిహాద్ రైల్ ప్యాసింజర్ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అబుదాబి–ఫుజైరా మార్గంలోనే ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను పరిశీలించి అవసరానికి అనుగుణంగా మరింత సామర్థ్యాన్ని పెంచుతామని సంస్థ చెబుతోంది. అంటే, ప్రస్తుతం కనిపిస్తున్న టికెట్ విక్రయాలు ప్రారంభ దశకు సంబంధించినవే. రాబోయే నెలల్లో కొత్త స్టేషన్లు, కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌లో దుబాయ్, అల్ ధైద్

ఎతిహాద్ రైల్ నెట్‌వర్క్ విస్తరణకు సంబంధించిన తదుపరి కీలక దశ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఆ రోజు దుబాయ్, అల్ ధైద్ స్టేషన్లను ప్రయాణికుల కోసం ప్రారంభించనున్నారు. దీంతో యూఏఈలోని మరిన్ని ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. కొత్త స్టేషన్లు ప్రారంభం కావడంతో ప్రస్తుతం ఉన్న డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

నవంబర్, డిసెంబర్‌లో మరిన్ని స్టేషన్లు

Advertisement

నవంబర్ 30న లివా, మదీనత్ జాయెద్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 30న అల్ ధఫ్రా ప్రాంతంలోని మిగిలిన స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక ఉంది. ఈ దశలతో ఎతిహాద్ రైల్ నెట్‌వర్క్ మరింత విస్తరిస్తుంది. ప్రయాణికులకు యూఏఈలోని  పలు ప్రాంతాల మధ్య రోడ్డు ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా రైలు అందుబాటులోకి వస్తుంది.

2027లో షార్జాకు రైలు

ఎతిహాద్ రైల్ విస్తరణ 2027లో కూడా కొనసాగనుంది. మార్చి 30, 2027న షార్జా ప్రయాణికుల రైల్వే నెట్‌ వర్క్‌ లో చేరనుంది. ప్రస్తుతం ఐదు వారాల్లోనే 70,000కు పైగా టికెట్లు అమ్ముడవడం చూస్తే, కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎతిహాద్ రైల్‌కు మరింత ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఏఈ అంతటా ఇంటర్‌సిటీ ప్రయాణ విధానాన్ని మార్చడంలో ఈ రైలు నెట్‌వర్క్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Read Also: అదిరిపోయే రేంజ్.. అంతకు మించి ఫీచర్లు.. ఈ 4 మోడళ్లపై ఓ లుక్కేయండి!

Tags

Related News

12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూచే పువ్వు.. తుంచితే రూ.25000 జరిమానా..

2026లోనూ రైల్వే లైన్ లేని దక్షిణ భారత జిల్లాలు ఇవే.. కారణం తెలిస్తే షాక్!

కేవలం రూ.16కే ఫ్రెష్ బీర్.. వాటర్ బాటిల్ కంటే తక్కువ ధర.. బారులు తీరుతున్న జనం

పెళ్లి కాగానే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు.. కొత్త జర్నీ ఇక్కడి నుంచే!

దోశను స్పూన్‌తో తినాలా? పైగా దానికి ట్రైనింగ్ కూడా!

భోగాపురంలో దిగిన ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్‌కు ఘన స్వాగతం.. ఈ వీడియో చూశారా?

దేవుడి విగ్రహం పగలగొట్టి.. యముడికి ఛాలెంజ్, తర్వాతి రోజే ఘోర ప్రమాదం, చివరికి..

Big Stories

Advertisement
×