E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఒక్క టికెట్‌ తో అయోధ్య, కాశీ, పూరీ దర్శనం.. IRCTC బంపర్ ఆఫర్!

ఒక్క టికెట్‌ తో అయోధ్య, కాశీ, పూరీ దర్శనం.. IRCTC బంపర్ ఆఫర్!
Advertisement

Secunderabad to Ayodhya and Kashi Yatra: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే ప్రయాణంలో దర్శించాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి రెండు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ యాత్రల్లో ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలతో పాటు దక్షిణ భారతంలోని ప్రముఖ దేవాలయాలను కూడా సందర్శించే అవకాశం కల్పిస్తోంది.

తొలి ప్యాకేజీలో అయోధ్య, కాశీ యాత్ర

మొదటి ప్యాకేజీలో అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, పూరీ, కోణార్క్, డియోఘర్ లాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను సందర్శించేలా టూర్‌ ను రూపొందించారు. శ్రీరామ జన్మభూమి, కాశీ విశ్వనాథ ఆలయం, త్రివేణి సంగమం, జగన్నాథ ఆలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఈ యాత్రలో దర్శించవచ్చు. భక్తులకు ఒకే ప్యాకేజీలో పలు ప్రసిద్ధ క్షేత్రాలను చూసే అవకాశం లభిస్తుంది.

రెండో ప్యాకేజీలో దక్షిణ భారత దేశాలయాలు కవర్

Advertisement

రెండో ప్యాకేజీ దక్షిణ భారతంలోని ముఖ్యమైన దేవాలయాలను కవర్ చేస్తుంది. దివ్య దక్షిణ యాత్ర పేరుతో నిర్వహించే ఈ టూర్‌ లో పలు ప్రసిద్ధ ఆలయాలను సందర్శించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి ఈ ప్యాకేజీ అనుకూలంగా ఉంటుంది.

ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే CPRO ఎ. శ్రీధర్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రయాణికులు రైలెక్కిన క్షణం నుంచి తిరిగి సికింద్రాబాద్ చేరుకునే వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఐఆర్‌సిటీసీ చూసుకుంటుందన్నారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్రను పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. ఈ టూర్ ప్యాకేజీల్లో రైలు ప్రయాణం, వసతి, భోజనం, స్థానిక రవాణా, దర్శన ఏర్పాట్లు, రైలులో అవసరమైన సేవలు, సదుపాయాలు ఉంటాయన్నారు. ప్రయాణికులు విడివిడిగా బుకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే ప్యాకేజీలో అన్ని సౌకర్యాలను పొందే అవకాశం ఉందన్నారు.

Advertisement

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభించబడ్డాయి. తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి  మంచి అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, కుటుంబాలతో కలిసి వెళ్లే భక్తులకు ఈ ప్యాకేజీలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.  ఈ ప్రత్యేక యాత్రలకు సంబంధించి పూర్తి వివరాలు, ప్రయాణ తేదీలు, ఛార్జీలు, బుకింగ్ విధానంలాంటి పూర్తి సమాచారం ఐఆర్‌సిటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్న నేపథ్యంలో ఆసక్తి ఉన్న భక్తులు ముందుగానే ప్యాకేజీ తీసుకోవడం మంచిదన్నారు.

Read Also: వందే భారత్ డోర్లు క్లోజ్ అయినా నో టెన్షన్.. ఇలా చేస్తే హ్యాపీగా రైలు ఎక్కొచ్చు!

Related News

వందే భారత్ సహా 12 రైళ్ల రూట్ ఛేంజ్.. మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

దేశంలో అత్యంత డేంజరస్ రైల్వే కారిడార్లు ఇవే.. 70 శాతం ప్రమాదాలు ఇక్కడే!

సైకో టూరిస్టులు.. కేతన్ హత్య జరిగిన కోటకు క్యూ, చావు కూడా వినోదమేనా?

ఫుల్ పైసా వసూల్ వందే భారత్ ట్రావెల్ రూట్స్.. ప్రకృతి అందాల అనుభూతి తక్కువ బడ్జెట్‌లో

మళ్లీ సరిహద్దులు దాటనున్న రైళ్లు.. త్వరలో భారత్-బంగ్లాదేశ్ సర్వీసులు ప్రారంభం!

మహిళను చూస్తూ అసభ్య సైగలు, వైరల్ వీడియోపై రైల్వే సీరియస్!

వర్షాకాలంలో స్వర్గాన్ని తలపించే హిల్ స్టేషన్.. దేశంలో టాప్ ట్రావెల్ డెస్టినేషన్స్‌లో స్థానం

Big Stories

×