E-Paper
Advertisement

Visakhapatnam Raipur Expressway: ఏపీకి మరో ఫోర్ లైన్.. విశాఖ నుండి జర్నీ చాలా ఈజీ బాస్!

Visakhapatnam Raipur Expressway: ఏపీకి మరో ఫోర్ లైన్.. విశాఖ నుండి జర్నీ చాలా ఈజీ బాస్!
Advertisement

Visakhapatnam Raipur Expressway: ఏపీకి మరో ఫోర్‌లైన్ హైవే రూపుదిద్దుకుంటోంది. విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వరకు వెళ్లే 464 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేలో విజయనగరం జిల్లాలోని కొర్లం ఇంటర్‌చేంజ్ ఒక కీలక మలుపుగా మారుతోంది. విశాఖ నుంచి జర్నీ చాలా ఈజీ బాస్! అనిపించేలా దాని నిర్మాణం కొనసాగుతోంది.

కొర్లం మలుపు.. అభివృద్ధికి ఆరంభం
విశాఖపట్నం – రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో కొర్లం వద్ద భారీ ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్లు, జంక్షన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఇంటర్‌ ఛేంజ్ పూర్తయితే, ఉత్తరాంధ్ర రవాణా చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది. ప్రత్యేకంగా రవాణా వేగం పెరగడం వల్ల ప్రయాణ సమయం, ఖర్చు రెండూ తగ్గనున్నాయి.

Advertisement

గంటల ప్రయాణం గంటల్లోకి
ఇంతకుముందు విశాఖ నుంచి రాయ్‌పూర్ వెళ్తే కనీసం 14 గంటలు పట్టేది. కానీ ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత ఆ సమయం సగానికి తగ్గనుంది. ట్రక్‌లు, బస్సులు కూడా సులభంగా ఈ దారిలో వెళ్లే అవకాశం ఉంది. ట్రావెల్ ప్లానింగ్‌లో ఈ మార్గం టాప్ ఛాయిస్ అయ్యే రోజులు దూరంలో లేవు.

రైలు కంటే స్పీడుగా, రోడ్డు కంటే స్మార్ట్‌గా!
ఈ హైవే స్మార్ట్ టెక్నాలజీతో నడుస్తోంది. సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌లు, ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్స్ అన్నీ ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఉంటాయి. భవిష్యత్తులో వాహనాలు నావిగేషన్ ద్వారా కొర్లం ఇంటర్‌ ఛేంజ్ మీదుగా ఎక్కడికి వెళ్తున్నాయో ముందే ప్లాన్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.

Advertisement

వ్యాపారం – వాణిజ్యానికి బూస్ట్
విశాఖ పోర్ట్ నుంచి వస్తువులు, ఉత్పత్తులు ఉత్తర భారత రాష్ట్రాలకు తక్కువ టైంలో చేరేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతులకు వేగం వస్తుంది. అనేక కంపెనీలు కొత్తగా ఈ మార్గం పక్కనే గోడౌన్లు, డిపోలు ఏర్పరిచేందుకు సిద్ధమవుతున్నాయి.

Also Read: Newborn Baby: బస్సులో బిడ్డ పుట్టింది.. కాసేపటికే బయటకు విసిరేశారు! ఎక్కడ జరిగిందంటే?

రైతుకు రెక్కలొచ్చినట్టు..
కొర్లం ఇంటర్‌చేంజ్ వల్ల తక్కువ టైంలో పట్టణ మార్కెట్లకు చేరుకోవచ్చు. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ ఉత్పత్తులను సులభంగా పట్టణ మార్కెట్లకు చేర్చే అవకాశం ఉంటుంది. పైగా, హైవే పక్కన అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలతో ఉద్యోగ అవకాశాలూ పెరగనున్నాయి.

పట్టణం పటములో కొత్త కేంద్రంగా కొర్లం
ఇంటర్‌చేంజ్ లొకేషన్ విజ్ఞప్తికీ, వాణిజ్యానికీ మంచి స్పాట్‌గా మారుతుంది. ఇప్పటికిప్పుడు నిర్మాణ దశలో ఉన్నప్పటికీ, కొర్లం వాసులు భవిష్యత్తులో టౌన్‌షిప్ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. పనుల వేగం బాగా ఉందని, సుమారు 40 శాతం పూర్తి అయ్యిందని రోడ్డు అభివృద్ధి సంస్థలు చెబుతున్నాయి. వచ్చే సంవత్సరం మధ్య నాటికి మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

విజయనగరం జిల్లా వైభవాన్ని పెంచనున్న రహదారి
కొర్లం ఇంటర్‌చేంజ్ ఒక్క రోడ్డు మార్గం కాదు, అది ఉత్తరాంధ్ర అభివృద్ధికి తెరతీసే తలుపు. వాణిజ్యం, రవాణా, ఉపాధి, వ్యవసాయం అన్నీ ఈ రహదారితో బాట పడబోతున్నాయి. విశాఖ నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ప్రయాణించాలంటే ఇక చాలా ఈజీ బాస్!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×