BigTV English

Vizag Railway Station: రూ. 500 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

Vizag Railway Station: రూ. 500 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

Indian Railways: విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. రూ. 500 కోట్లలో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని విశాఖ ఎంపీ భరత్ ప్రకటించారు. 18 నుంచి 21 నెలల్లో రైల్వే స్టేషన్ పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని రైల్వే అధికారులకు ఆదేశాలు అందినట్లు ఆయన వెల్లడించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా 6 అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సంఖ్య మొత్తం 14 కి పెరుగుతాయని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌ను నియమించిందని, ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. ఆయన రాకతో విశాఖ రైల్వే పరంగా మరింత అభివృద్ది చెందుతుందన్నారు. త్వరలో, గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అవుతుందన్నారు.


విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రపంచ స్థాయి వసతులు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. స్టేషన్ పునరాభివృద్ధి పథకం కింద, ప్రయాణీకులకు విమానాశ్రయం లాంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో మసాజ్ కుర్చీలు, డ్రెస్సింగ్ రూమ్, బేబీ ఫీడింగ్ రూమ్, విశాలమైన లాంజ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి రూ. 393 కోట్లు కేటాయించారు. ఈ స్టేషన్‌లో 14 ప్లాట్‌ఫారమ్‌లు, 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 3 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతుంది.  హౌరా నుండి చెన్నై వెళ్లే ప్రధాన రైల్వే మార్గంలో ఉంది.


డీపీఆర్ దశలో మెట్రో పనులు   

అటు మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ దశలో ఉందని ఎంపీ భరత్ తెలిపారు. సంబంధిత అధికారులు వివరణాత్మక డిజైన్ బిడ్లను కూడా పిలిచినట్లు తెలిపారు. దీని కోసం దాదాపు 20 మంది డిజైన్ కన్సల్టెంట్లు ఆసక్తి చూపించినట్లు వివరించారు.  సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు జీఎం నియామకం ఎన్డీఏ ప్రభుత్వం తన రైల్వే హామీలను నెరవేర్చడానికి నిబద్ధతను ప్రదర్శిస్తుందన్నారు.  గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన హయాంలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి భూమిని కేటాయించడంలో విఫలమైందని  విమర్శించారు. ఎన్డీఏ హయాంలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి లాంటి కీలక ప్రాజెక్టులను పునరుజ్జీవింపజేస్తున్నామన్నారు.

Read Also: ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్లాలా? ఇలా ఈజీగా ప్లాన్ చేసుకోండి!

యోగా డే కోసం భారీ ఏర్పాట్లు

ఇక ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని శ్రీ భరత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నం వరకు 3.5 నుండి 5 లక్షల మంది పాల్గొనే ఈ కార్యక్రమం రికార్డులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భరత్ వెల్లడించారు.

Read Also:  విశాఖ నుంచి రైల్లో నేరుగా.. ఈ అందమైన ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు.. ఈ 4 మిస్ కావద్దు!

Related News

Dussehra festival: హైదరాబాద్ లో స్పెషల్ హాల్టింగ్స్, దసరా వేళ ప్రయాణీలకు క్రేజీ న్యూస్!

Festival Special Trains: అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

Indian Railways: హైదరాబాద్ లో నాలుగు లైన్ల రైలు మార్గం, అమ్మో అన్ని లాభాలా?

Vande Bharat Trains: హైదరాబాద్ కు 2 కొత్త వందే భారత్ రైళ్లు.. శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ స్థానంలో రీ ప్లేస్!

Water on Coal: రైల్వే వ్యాగన్లలో బొగ్గు తరలించేటప్పుడు నీళ్లు చల్లుతారు, ఎందుకో తెలుసా?

Moscow – Indian Tourists: భారత పర్యాటకులకు మాస్కో సాదర స్వాగతం, కారణం ఏంటో తెలుసా?

Benefits of Train Ticket: రైల్వే టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? అస్సలు ఊహించి ఉండరు!

Vande Bharat: వందేభారత్ లో తాగి రచ్చ చేసిన జంట, RPF సిబ్బంది ఏం చేశారంటే?

Big Stories

×