E-Paper
Advertisement

Vizag Railway Station: రూ. 500 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

Vizag Railway Station: రూ. 500 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?
Advertisement

Indian Railways: విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. రూ. 500 కోట్లలో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని విశాఖ ఎంపీ భరత్ ప్రకటించారు. 18 నుంచి 21 నెలల్లో రైల్వే స్టేషన్ పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని రైల్వే అధికారులకు ఆదేశాలు అందినట్లు ఆయన వెల్లడించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా 6 అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సంఖ్య మొత్తం 14 కి పెరుగుతాయని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌ను నియమించిందని, ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. ఆయన రాకతో విశాఖ రైల్వే పరంగా మరింత అభివృద్ది చెందుతుందన్నారు. త్వరలో, గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అవుతుందన్నారు.

విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రపంచ స్థాయి వసతులు

Advertisement

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. స్టేషన్ పునరాభివృద్ధి పథకం కింద, ప్రయాణీకులకు విమానాశ్రయం లాంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో మసాజ్ కుర్చీలు, డ్రెస్సింగ్ రూమ్, బేబీ ఫీడింగ్ రూమ్, విశాలమైన లాంజ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి రూ. 393 కోట్లు కేటాయించారు. ఈ స్టేషన్‌లో 14 ప్లాట్‌ఫారమ్‌లు, 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 3 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతుంది.  హౌరా నుండి చెన్నై వెళ్లే ప్రధాన రైల్వే మార్గంలో ఉంది.

డీపీఆర్ దశలో మెట్రో పనులు   

Advertisement

అటు మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ దశలో ఉందని ఎంపీ భరత్ తెలిపారు. సంబంధిత అధికారులు వివరణాత్మక డిజైన్ బిడ్లను కూడా పిలిచినట్లు తెలిపారు. దీని కోసం దాదాపు 20 మంది డిజైన్ కన్సల్టెంట్లు ఆసక్తి చూపించినట్లు వివరించారు.  సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు జీఎం నియామకం ఎన్డీఏ ప్రభుత్వం తన రైల్వే హామీలను నెరవేర్చడానికి నిబద్ధతను ప్రదర్శిస్తుందన్నారు.  గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన హయాంలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి భూమిని కేటాయించడంలో విఫలమైందని  విమర్శించారు. ఎన్డీఏ హయాంలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి లాంటి కీలక ప్రాజెక్టులను పునరుజ్జీవింపజేస్తున్నామన్నారు.

Read Also: ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్లాలా? ఇలా ఈజీగా ప్లాన్ చేసుకోండి!

యోగా డే కోసం భారీ ఏర్పాట్లు

ఇక ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని శ్రీ భరత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నం వరకు 3.5 నుండి 5 లక్షల మంది పాల్గొనే ఈ కార్యక్రమం రికార్డులను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భరత్ వెల్లడించారు.

Read Also:  విశాఖ నుంచి రైల్లో నేరుగా.. ఈ అందమైన ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు.. ఈ 4 మిస్ కావద్దు!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×