BigTV English

Vande Bharat Express: వందే భారత్.. ఏసీ డెక్ నుంచి నీళ్లు.. కొత్త ఫెసిలిటీనా?

Vande Bharat Express: వందే భారత్.. ఏసీ డెక్ నుంచి నీళ్లు.. కొత్త ఫెసిలిటీనా?

Vande Bharat Express Water Leak: భారతీయ రైల్వేలో అత్యాధుని రైలుగా గుర్తింపు తెచ్చుకున్న వందేభారత్ లోనూ ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఏసీ డెక్ నుంచి వాటర్ లీకేజీ అయ్యింది. ఈ నీళ్లు పడి ఓ ప్రయాణీకురాలితో పాటు ప్రయాణీకులు లగేజీ కూడా తడిసిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను @Benarasiyaa అనే నెటిజన్ షేర్ చేశాడు. “ఢిల్లీకి వెళ్లే 22415 వందే భారత్ ఎక్స్‌  ప్రెస్‌ లో అన్‌ లాక్ చేయబడిన ఉచిత  జలపాత సేవ” అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  ఈ ఘటనపై రైల్వే అధికారులు ఇంకా స్పందించలేదు.


2024లోనూ వందేభారత్ లో వాటర్ లీకేజీ

వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో వాటర్ లీకేజీ ఇదే తొలిసారి కాదు, 2024లోనూ ఇలాంటి ఘటన ఎదురయ్యింది. అప్పట్లో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నార్త్ రైల్వే పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఉత్తర రైల్వే అప్పట్లో వివరణ కూడా ఇచ్చింది. తాత్కాలిక సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించినట్లు వివరించింది. “తాత్కాలికంగా పైపులు మూసుకుపోవడం వల్ల కోచ్‌ లో స్వల్పంగా నీటి లీకేజీ కనిపించింది!  రైలులోని సిబ్బంది కూడా దీనిని పరిశీలించి సరిచేశారు. దీనివల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము” అని ఉత్తర రైల్వే అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

తాజా ఘటనపై నెటిజన్ల సటైర్లు

తాజాగా వందేభారత్ రైల్లో వాటర్ లీకేజీ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది కామెడీగా కామెంట్స్ పెడుతుంటే మరికొంత మంది సటైర్లు వేస్తున్నారు.  ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వాటర్ లీకేజీకి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ..  “ఎయిర్ ఇండియా ప్రయాణీకులు మాత్రమే ఎందుకు ఆనందించాలి? వందేభారత్ ప్రయాణీకులు కూడా ఎంజాయ్ చేయాలి” అని రాసుకొచ్చాడు. “గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రయాణీకులకు గొప్ప సేవలు అందించడం రైల్వే అధికారులు నేర్చుకోవాలి” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను మొత్తం వందేభారత్ రైళ్లకు ఆపాదించడం సరికాదు. అనుకోని పొరపాట్ల కారణంగా ఇలాంటి ఘటనలను జరుగుతాయి. వాటిని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు” అని మరో నెటిజన్లు అభిప్రాయపడ్డాడు. “వందే భారత్ లో వాటర్ ఫాల్స్ సౌకర్యం” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Read Also:  ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!

Related News

Hydrogen Train: హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఫస్ట్ సర్వీస్ అక్కడే.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి!

Tax Relief: మీ పెంపుడు జంతువులను సింహాలకు ఆహారంగా ఇస్తే.. ట్యాక్స్ నుంచి ఉపశమనం!

Escalators at Mountains: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!

Tirumala rules: తిరుమలకు వచ్చే వాహనాలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 15 నుండి కొత్త రూల్స్!

Free Wi-Fi: రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

Air India Flights: అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Big Stories

×