E-Paper
Advertisement

Hyderabad Crime News: కాబోయే భార్యను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు.. కానీ చివరకు..?

Hyderabad Crime News: కాబోయే భార్యను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు.. కానీ చివరకు..?

Hyderabad Crime News: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొన్ని వారాల క్రితం ఆకాష్(25) అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. వారి పెళ్లి వచ్చే నెలలో జరగనుంది. అయితే సోమవారం రోజున ఆకాష్ తనకు కాబోయే భార్యకు కాల్ చేసి ఔట్ సైడ్ ట్రిప్‌ కు వెళ్దామని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆకాశ్ బ్లాక్ మెయిల్ చేద్దామని ప్రయత్నం చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే అతను ఉరి వేసుకున్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతను కుర్చీ దిగే క్రమంలో అకస్మాత్తుగా మెడకు ఉచ్చు బిగుంచుకుని ఊపిరాడక మృతిచెందాడు.

ALSO READ: Women’s Day 2025 : విజయశాంతి నుంచి అనుష్క, సాయి పల్లవి వరకు… టాలీవుడ్ ను షేక్ చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు

పోలీసులు వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన ఆకాష్(25) కు కొన్ని రోజుల క్రితం ఓ యువతితో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. వివాహం మరో నెల రోజుల్లో జరగాల్సి ఉంది. ఏప్రిల్ నెలలో మ్యారేజ్ ఫిక్స్ చేవారు. అయితే.. ఆకాశ్ సోమవారం రోజున తనకు కాబోయే భార్య కాల్ చేశాడు. బైక్ పై బయటకు వెళ్దామని యువతిని అడిగాడు. యువకుడితో బయటకు వెళ్లడానికి యువతి తిరస్కరించింది. దీంతో ఆ యువతిని బెదరించడానికి ఆకాశ్ ప్రయత్నించాడు. యువకుడు తాడుతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు.

ALSO READ: Nindu Noorella Saavasam Serial Today March 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  నిజం తెలుసుకున్న అమర్‌ – రణవీర్‌, మనోహరిని నిలదీసిన అమర్‌

యువతికి వీడియో కాల్ చేేసి.. తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం కోపంతో ఫోన్ కట్ చేశాడు. అయతే ఆకాశ్ కుర్చీ నుంచి దిగే క్రమంలో జారి పడ్డాడు. దీంతో మెడ చుట్టూ ఉచ్చు బిగుంచుకుంది. గొంతుకు తాడు గట్టిగా పట్టివేయడంతో యువకుడు ఊపిరి ఆడక మృతిచెందాడు. ఆకాశ్ ఆత్మహత్యాయత్నం చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరూ లేరని కాచిగూడ ఎస్ఐ నరేష్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×