E-Paper
Advertisement

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. ఆరు కొత్త చట్టాల ప్రవేశపెట్టబోతున్న మోదీ ప్రభుత్వం సిద్ధం..

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. ఆరు కొత్త చట్టాల ప్రవేశపెట్టబోతున్న మోదీ ప్రభుత్వం సిద్ధం..
Advertisement

Parliament Monsoon Session| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయే వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టబోతోంది. లోక్ సభ సెక్రటేరియట్ గురువారం సాయంత్రం విడుదల చేసిన పార్లమెంట్ బులెటిన్ లో మరో నాలుగు రోజుల తరువాత జరుగబోయే సమావేశాల్లో ప్రవేశబట్టబోయే బిల్లుల లిస్టు ప్రచురించబడింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగునున్నాయి. మంగళవారం, జూలై 23న అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2024-25ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల తరువాత పూర్తి స్థాయి జరిగే పార్లమెంట్ సమావేశాలు ఇవే.

Advertisement

Also Read: ‘మీ ఇల్లు అని తెలీక దొంగతనం చేశాను.. సారీ’.. లెటర్ రాసి సొమ్మును తిరిగి ఇచ్చేసిన విచిత్ర దొంగ!

పార్లమెంట్ సెషన్‌లో ప్రవేశబెట్టబోయే ఆరు బిల్లుల వివరాలు:
1. విపత్తు నిర్వహణ సవరణ బిల్లు (డిజాస్టర్ మెనేజ్ మెంట్ సవరణ బిల్లు)
2. ఫైనాన్స్ బిల్లు
3.1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని తొలగించి దాని స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లు
4. స్వాతంత్రం ముందు ఉన్న చట్టానికి బదులుగా బాయిలర్స్ బిల్లు
5. కాఫీ ప్రొమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు
6. రబ్బర్ ప్రొమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు

Advertisement

బిజినెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన లోక్ సభ స్పీకర్

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ ఎంజెడా నిర్ణయించడానికి లోక్ సభలో ఒక బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 15 సభ్యులున్నారు. వీరిలో ఎక్స్ అఫీషియో చెయిర్ పర్సన్ గా స్వయంగా లోక్ సభ స్పీకర్ ఉంటారు. ఈ సభ్యులందరూ స్పీకర్ ద్వారా నామినేట్ చేయబడ్డ వారే. పార్లమెంట్ లో జరిగే ప్రతి సెషన్‌కు ముందు ఈ కమిటీ సభ్యలు సమావేశమవుతారు. ఆ తరువాత అవసరమైతే ప్రత్యేక సమావేశాలకు హాజరవుతారు. ఈ కమిటీ సభ్యుల్లో చైర్మెన్ గా స్పీకర్ సహా మొత్తం ఏడుగురు బిజేపీ సభ్యలున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు, జెడియు నుంచి ఒకరు, తెలుగుదేశం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, సమాజ్ వాదీ పార్టీల తరపున ఒక్కొక్కరు సభ్యులుగా ఉన్నారు. భారత దేశంలో 1952, జూలై 14 నుంచి ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్వహణ జరుగుతూనే ఉంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×